Eric Schmidt: ఏఐతో ముప్పే.. గూగుల్ మాజీ సీఈవో హెచ్చరిక
కృత్రిమ మేధను (Artificial Intelligence) సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో మానవాళికి ముప్పు తప్పదని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిత్ హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ (Artificial Intelligence)ను సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని పలువురు టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిత్ కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధపై నియంత్రణ లేకుంటే రానున్న రోజుల్లో మానవాళికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వాల్స్ట్రీట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు. గూగుల్ సీఈవోగా 2001 నుంచి 2011 వరకు కొనసాగిన ఎరిక్ ష్మిత్.. 2015 నుంచి 2017 వరకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా వ్యవహరించారు.
‘ఎంతో మంది చెప్పినట్లుగా కృత్రిమ మేధతో అస్తిత్వ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కాకపోయినా.. సమీప భవిష్యత్తులో వీటి నుంచి ముప్పు ఉంటుంది. నేడు ఇది కల్పన మాత్రమే అయినప్పటికీ అది వాస్తవరూపం దాల్చవచ్చు. అటువంటిది సంభవించినప్పుడు అవి చెడు వ్యక్తుల బారినపడి దుర్వినియోగం కాకుండా చూసుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి’ అని ఎరిక్ పేర్కొన్నారు. అణు సాంకేతికతతో పోల్చిన ఆయన.. ఏఐ వ్యాప్తిని నియంత్రించడం అత్యంత కష్టమని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ సంస్థలైన ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్మైండ్ అధినేతలతోపాటు బ్రిటన్ ప్రధాని పాల్గొన్న ఈ సమావేశంలో ఎరిక్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
వేగంగా వృద్ధి చెందుతోన్న కృత్రిమ మేధ, దాని దుష్ర్పభావాలపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai), టెస్లా సీఈవో ఎలాన్ మస్క్తోపాటు ఇతర టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంకేతికతను (Artificial Intelligence) సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించిన పిచాయ్.. వాటి దుష్ర్పభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఇటీవల పేర్కొన్నారు. మరోవైపు బిల్గేట్స్ మాత్రం ఇటీవల ఏఐ సాధిస్తున్న పురోగతిని కొనియాడారు. అయితే, వీటిపై టెక్ దిగ్గజాధినేతల ఆందోళనను అంగీకరించిన గేట్స్.. సాంకేతికత పరిజ్ఞానానికి సంబంధించి ప్రభుత్వ నియంత్రణ అవసరమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!