ఆసుపత్రిపై ఉక్రెయిన్ రాకెట్ దాడి.. 14 మంది మృతి
లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్లోని ఓ ఆసుపత్రిపై ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో 14 మంది మృతి చెందారని రష్యా రక్షణశాఖ శనివారం తెలిపింది.
మాస్కో: లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్లోని ఓ ఆసుపత్రిపై ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో 14 మంది మృతి చెందారని రష్యా రక్షణశాఖ శనివారం తెలిపింది. అమెరికాలో తయారైన హిమార్స్ రాకెట్ లాంఛర్లతో ఈ దాడి జరిపినట్లు వెల్లడించింది. భారీస్థాయి పేలుడు పదార్థాలున్న రాకెట్లను ఉపయోగించడంతో రోగులు, వైద్య సిబ్బందిలో మరో 24 మంది గాయపడ్డారని తెలిపింది.
మూడో ప్రపంచ యుద్ధం వస్తే మిగిలేది బూడిదే: మెద్వదేవ్
మూడో ప్రపంచ యుద్ధమనేది వస్తే అది యుద్ధట్యాంకులతోనో, విమానాలతోనో మొదలు కాదనీ, చివరకు మిగిలేది బూడిదే అని రష్యా భద్రత మండలి డిప్యూటీ ఛైర్మన్ మెద్వెదేవ్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలు తమ చర్యను సమర్థించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు శనివారం టెలిగ్రాం ఛానల్లో ఆయన రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్