ఢాకాలో ఘోర బస్సు ప్రమాదం
బంగ్లాదేశ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగబంధు ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న బస్సు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 19 మంది మృతిచెందారు.
కాల్వలోకి దూసుకెళ్లి.. 19 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగబంధు ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న బస్సు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 19 మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. దాదాపు 50 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు ఇక్కడి సోనాదంగా నుంచి ఢాకాకు బయల్దేరింది. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో మార్గమధ్యంలోని మదారీపుర్ వద్ద బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీస్ సూపరింటెండెంట్ ఎండీ మసూద్ ఆలం తెలిపారు. 30 అడుగుల లోతు గుంతలోకి పడ్డ బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని, సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడినవారిని ఢాకా వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్