క్రిమియాలో రష్యా క్షిపణుల ధ్వంసం
పాశ్చాత్య దేశాల నుంచి అందుతున్న ఆయుధ సహాయంతో రష్యాను పలురకాలుగా ఉక్రెయిన్ దెబ్బకొడుతోంది.
ఆ పని చేసింది మేమేనన్న ఉక్రెయిన్
లేదు.. విద్యుత్ లైన్లనే నాశనం చేశారన్న క్రిమియా అధికారులు
కీవ్: పాశ్చాత్య దేశాల నుంచి అందుతున్న ఆయుధ సహాయంతో రష్యాను పలురకాలుగా ఉక్రెయిన్ దెబ్బకొడుతోంది. తాజాగా రష్యా ఆక్రమించిన తమ భూభాగం క్రిమియా ద్వీపకల్పంలో ఓ రైలులో తరలిస్తున్న క్రూయిజ్ క్షిపణులపై దాడికి పాల్పడింది. ఉత్తర క్రిమియాలోని జంకోయ్ పట్టణ సమీపంలో భారీ ఎత్తున కాలిబర్ క్రూయిజ్ క్షిపణులు ధ్వంసమైన ఘటన పేలుడు వెనుకున్నది తామేనని ఉక్రెయిన్ సైనిక అధికార ప్రతినిధి నటాలియా హుమెనుయిక్ సూచనప్రాయంగా తెలిపారు. అయితే ఇందుకు పూర్తిగా తమదే బాధ్యతని నేరుగా వెల్లడించలేదు. తాజా చర్య.. 2014లో అక్రమంగా స్వాధీనపరచుకున్న నల్ల సముద్ర ద్వీపకల్పాన్ని తప్పక విడిచిపెట్టాలని రష్యాకు హెచ్చరిక అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ డ్రోన్లు జంకోయ్ పట్టణంలో మౌలిక సదుపాయాలపై దాడులు జరిపాయని క్రెమ్లిన్ అధికార వర్గాలు తెలిపాయి. రైల్వే సదుపాయాలపై కాకుండా పౌరుల నివాస ప్రాంతాలను డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని క్రెమ్లిన్ నియమిత క్రిమియా అధినేత సెర్గీ అక్సెనోవ్ సలహాదారు ఒలేగ్ క్రుచ్కోవ్ వెల్లడించారు. విద్యుత్ లైన్లు సహా ఓ ప్రైవేటు భవనం, దుకాణం, మరో కళాశాల భవంతి దెబ్బతిన్నాయని జంకోయ్ పాలనాధిపతి ఇగోర్ ఐవిన్ తెలిపారు. మరోపక్క అధీకృతం కాని సోషల్ మీడియా కథనాలు...రష్యాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ క్రిమియాపైకి చొచ్చుకొచ్చిన డ్రోన్లను నేలకూల్చిందని పేర్కొన్నాయి. క్రిమియా ద్వీపకల్పంలో భారీ పేలుడు జరిగిన వీడియో ఒకటి ఆంగ్ల మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. రైల్వే స్టేషన్పై ఆ క్షిపణి దాడి జరిగిందని స్థానికులు వెల్లడిస్తున్నారు. క్రిమియాలో కీలకమైన ఎయిర్ ఫీల్డ్ల్లో జంకోయ్, గార్వెడెస్కోయ్లు కీలకమైనవి. వీటిల్లో జంకోయ్ కీలక రైల్వే కేంద్రం కూడా. దక్షిణ ఉక్రెయిన్ నుంచి ఇక్కడికి కీలకమైన యుద్ధ సామగ్రి సరఫరా అవుతుంది. తాజాగా ఉక్రెయిన్ దాడిలో ధ్వంసమైన క్షిపణులు సెవస్తోపోల్లోని రష్యా నౌకాదళాలకు అందాల్సి ఉంది.
పశ్చిమదేశాలు ఊ అంటే.. చైనా వద్ద శాంతి ప్రణాళిక: పుతిన్
కీవ్: పశ్చిమ దేశాలు ముందుకొస్తే ఉక్రెయిన్తో సాగుతున్న యుద్ధం పరిష్కారానికి చైనా వద్ద శాంతి ప్రణాళిక ఓ ఆధారాన్ని ఇస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చల అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్కు బాసటగా ఉన్న పశ్చిమ మిత్రదేశాలు చైనా శాంతి ప్రణాళికపై నిరాశక్తంగా ఉన్నాయని ఆక్షేపించారు. యుద్ధ ట్యాంకుల్లో వినియోగించేందుకు అణు పరికరాలు కలిగిన ఆయుధాలను ఉక్రెయిన్కు అందించాలని బ్రిటన్ భావిస్తోందని, అదేకనుక జరిగితే రష్యా తగిన విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్