European countries: మా దేశానికి రాకండి...!
భూతల స్వర్గం... చారిత్రక పట్టణం... అందాల బృందావనం... ఇలా ఏవేవో విశేషణాలతో ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షించే ఐరోపా ఇప్పుడు రివర్స్గేర్ వేస్తోంది. ‘బాబ్బాబూ మా వద్దకు రాకండి’ అంటూ టూరిజాన్ని కట్టడి చేస్తోంది.
టూరిజంపై ఐరోపా దేశాల ఆంక్షలు
అతి పర్యాటకంతో అతలాకుతలం
భూతల స్వర్గం... చారిత్రక పట్టణం... అందాల బృందావనం... ఇలా ఏవేవో విశేషణాలతో ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షించే ఐరోపా ఇప్పుడు రివర్స్గేర్ వేస్తోంది. ‘బాబ్బాబూ మా వద్దకు రాకండి’ అంటూ టూరిజాన్ని కట్టడి చేస్తోంది. పర్యాటకులపై అనేక ఆంక్షలు, పన్నులు విధిస్తోంది. కారణం- మితిమీరిన టూరిజం!
ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) జనాభా...8.5 లక్షలు!
కానీ ఏటా అక్కడికి వస్తున్న పర్యాటకులు 2.52 కోట్లు!
బార్సిలోనా (స్పెయిన్) జనాభా... 16 లక్షలు...
ఏటా పర్యాటకుల సంఖ్య 3 కోట్లు!
ఫ్లోరెన్స్ (ఇటలీ) జనాభా 3.8 లక్షలు.
ఏటా పర్యాటకులు దాదాపు 2 కోట్లు!
...ఎక్కువ పర్యాటకం అంటే ఎక్కువ ఆదాయం... ఎక్కువ ఉపాధి కల్పన! దేశానికి...ప్రజలకూ మంచిదే! కానీ అతి సర్వత్ర వర్జయేత్గా తయారవటంతో పరిస్థితి మారిపోయింది. కొవిడ్ తర్వాత కొద్దికాలం పర్యాటకం బాగానే అనిపించినా అది మితిమీరింది. ఇబ్బడిముబ్బడిగా పర్యాటకులు వచ్చి పడుతుండటంతో స్థానికులకు సమస్యలు మొదలయ్యాయి. ఆమ్స్టర్డామ్లాంటి చోట్లయితే... స్థానికులు స్వదేశంలో పరాయి వాళ్లుగా మారిపోతున్నామనే ఆందోళనలో పడ్డారు. ఇళ్లు, హోటళ్లు, రోడ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు అన్నీ కిక్కిరిసిపోవటంతో ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారింది. ట్రాఫిక్ పెరిగిపోయింది. వాయు, శబ్ద కాలుష్యం పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఉమ్మివేతలు పెరిగాయి. భద్రత తగ్గింది. మొత్తం మీద ఆదాయం పెరిగినా జీవనం దుర్భరంగా మారింది. విచ్చలవిడి శృంగారాన్ని అనుమతించే ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణం! అందుకే... పర్యాటకులకు స్వాగతం అన్న వారే... మా ఊరికి రాకండి... అనే దశకు వచ్చారు. స్థానికుల నుంచి ఆయా పట్టణ పురపాలక సంఘాలు, కౌన్సిళ్లపై పర్యాటకాన్ని ఆపాలంటూ ఒత్తిడి పెరిగింది. కానీ టూరిజం కారణంగా అనేక దేశాలకు భారీస్థాయిలో విదేశీమారక ద్రవ్యం వస్తుండటం... స్థానికంగానూ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుండటంతో ప్రభుత్వాలకు ఇది ఇబ్బందికరంగా పరిణమించింది. నిషేధం విధించే బదులు మధ్యేమార్గంగా కట్టడి చేయటానికి, పర్యాటకుల సంఖ్యను తగ్గించటానికి ప్రవేశ రుసుం విధించటం ఆరంభించారు. చివరకు పాత కాలంనాటి చర్చిలను సందర్శించే వారూ ప్రవేశ రుసుము చెల్లించాల్సి వస్తోంది.
సెల్ఫీ దిగితే జరిమానా
ఇటలీలో వెనిస్ పట్టణానికి వచ్చే వారికి... 3 నుంచి 10 యూరోల దాకా ప్రవేశ రుసుం అని పెట్టారు. గ్రీస్ తమదేశంలోని పురాతన ఆక్రోపోలిస్ను చూడటానికి వచ్చేవారికి టైమ్స్లాట్లు కేటాయించటం ఆరంభించింది. రోజుకు 20వేల మందికి మించి అనుమతించటం లేదు. పర్యాటకులను నింపుకొని వస్తున్న భారీ ఓడలను ఇటలీ, నెదర్లాండ్స్ నిషేధించాయి.
- కొన్ని బీచ్లలో, పట్టణాల్లో ఉండటానికి కాలవ్యవధిని నిర్ధారిస్తున్నారు. అంతకంటే ఎక్కువ సమయం గడిపితే జరిమానా వేస్తున్నారు. ఇటలీ పోర్టోఫినో సముద్ర తీరంలో సెల్ఫీలు దిగుతూ ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని... నో వెయిటింగ్ జోన్లుగా ప్రకటించారు. అక్కడ ఎక్కువ సేపు నిలబడితే 275 యూరోల జరిమానా పడుతుంది.
- వెనిస్లోని ఎరాక్లియా బీచ్లో ఇసుకగూళ్లు కడితే 250 యూరోల జరిమానా వేస్తున్నారు.
- పర్యాటకులను నియంత్రించటానికి ప్రాంతాల వారీగా షెడ్యూళ్లను ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఫ్రాన్స్. అందరికీ తెలిసిన ప్రాంతాలకు కాకుండా కొత్త ప్రాంతాలకు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాకుండా... విమాన ప్రయాణాలపై పన్ను పెంచబోతోంది.
- పోర్చుగల్... బీచ్లలో బంతి ఆటల్ని నిషేధించింది. బీచ్లలో మ్యూజిక్ వినిపిస్తే 200 యూరోల నుంచి 36,000 యూరోల దాకా జరిమానా.
- క్రొయేషియాలో పర్యాటకులు బ్యాగులతో తిరగటాన్ని, ఎక్కడపడితే అక్కడ తాగటాన్ని నిషేధించారు. జరిమానాయే కాకుండా జైల్లో వేస్తామని ప్రకటించారు.
అమెరికన్లపైనా ఆంక్షలు...
ఐరోపాలో అడుగుపెట్టడానికి అమెరికా సహా 60 దేశాల ప్రజలకు ఎలాంటి వీసా అవసరం లేదు. ఇప్పుడు వారిపైనా ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. 2024 నుంచి అమెరికా సహా 60 దేశాల నుంచి వచ్చే పర్యాటకులపై స్వల్పమొత్తంలో రుసుము వసూలు చేయబోతున్నారు. అంతేగాకుండా ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతి (వీసా కాదు) తీసుకోవాలి. మొత్తం మీద... పర్యాటకాన్ని వద్దనుకోలేక... అనుమతించలేక సతమతమవుతోంది ఐరోపా! ఈ పరిస్థితి భారత్లాంటి దేశాలకు లాభదాయకం అవుతుందని అనేవారూ లేకపోలేదు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. -
హమాస్.. ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హమాస్తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్