దౌత్యవేత్తల తగ్గింపు వివాదంలో.. కెనడాకు అమెరికా, బ్రిటన్ల వత్తాసు
దౌత్యవేత్తల తగ్గింపుపై భారత్, కెనడాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామాలపై అమెరికా, బ్రిటన్ శనివారం స్పందించాయి.
వియన్నా ఒప్పందాన్ని భారత్ పాటించాలన్న అగ్రరాజ్యం
వాషింగ్టన్, లండన్: దౌత్యవేత్తల తగ్గింపుపై భారత్, కెనడాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామాలపై అమెరికా, బ్రిటన్ శనివారం స్పందించాయి. భారత్ నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదంటూ ఈ దేశాలు రెండూ కెనడాకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్ చేసిన హెచ్చరికల కారణంగానే తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చినట్లు కెనడా చేసిన తాజా ప్రకటనతో ఇరు దేశాల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై అమెరికా స్పందిస్తూ.. వియన్నా ఒప్పంద సూత్రాల ప్రకారం దౌత్య సంబంధాలపై న్యూదిల్లీ తన బాధ్యతలను నిర్వర్తించాలని తాము ఆశిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. అటు బ్రిటన్ కూడా కెనడాకు మద్దతుగా భారత్ వైఖరిని నిరసించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘భారత్లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని దిల్లీ కోరడం.. దానికి అనుగుణంగా కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విభేదాల పరిష్కారానికి దౌత్యవేత్తలు విధుల్లో ఉండటం అవసరం. కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని ఒత్తిడి తేవద్దని మేం ఇప్పటికే భారత్ను కోరాం. అంతేకాకుండా నిజ్జర్ హత్య అంశంలో కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని అభ్యర్థించాం. 1961 నాటి వియన్నా ఒప్పందాన్ని భారత్ పాటించాలి. కెనడా దౌత్య మిషన్లో గుర్తింపు పొందిన సభ్యులకు లభించే అధికారాలు, దౌత్యపరమైన రక్షణ వారికి కల్పించాలి’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
భారత్ నిర్ణయాలతో ఏకీభవించం: బ్రిటన్
సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన దృష్ట్యా కెనడా దౌత్యవేత్తలు భారత్ నుంచి నిష్క్రమించడంపై బ్రిటన్ ప్రభుత్వం తన అసమ్మతిని వ్యక్తం చేసింది. ‘‘భారత్ నుంచి కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకునేలా దిల్లీ తీసుకున్న నిర్ణయాన్ని మేం అంగీకరించలేం. దౌత్యవేత్తలకు కల్పించే రక్షణను ఏకపక్షంగా ఎత్తివేయడం.. వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా లేదు’’ అని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అమెరికా తొలుత తటస్థంగా వ్యవహరించినా.. ఆ తర్వాత కెనడాకు మద్దతుగా పలుమార్లు వ్యాఖ్యలు చేసింది.
వియన్నా ఒప్పందానికి విరుద్ధం కాదు: భారత్
భారత్లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యులతో సహా వెనక్కి పిలిపించుకున్న కెనడా.. దౌత్యవేత్తలకు రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్ చేసిన హెచ్చరికను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే, వియన్నా ఒప్పందానికి అనుగుణంగానే దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వం అమలుకు ఈ చర్యలు తీసుకున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. -
హమాస్.. ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హమాస్తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్