దౌత్యవేత్తల తగ్గింపు వివాదంలో.. కెనడాకు అమెరికా, బ్రిటన్ల వత్తాసు
దౌత్యవేత్తల తగ్గింపుపై భారత్, కెనడాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామాలపై అమెరికా, బ్రిటన్ శనివారం స్పందించాయి.
వియన్నా ఒప్పందాన్ని భారత్ పాటించాలన్న అగ్రరాజ్యం
వాషింగ్టన్, లండన్: దౌత్యవేత్తల తగ్గింపుపై భారత్, కెనడాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామాలపై అమెరికా, బ్రిటన్ శనివారం స్పందించాయి. భారత్ నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదంటూ ఈ దేశాలు రెండూ కెనడాకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్ చేసిన హెచ్చరికల కారణంగానే తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చినట్లు కెనడా చేసిన తాజా ప్రకటనతో ఇరు దేశాల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై అమెరికా స్పందిస్తూ.. వియన్నా ఒప్పంద సూత్రాల ప్రకారం దౌత్య సంబంధాలపై న్యూదిల్లీ తన బాధ్యతలను నిర్వర్తించాలని తాము ఆశిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. అటు బ్రిటన్ కూడా కెనడాకు మద్దతుగా భారత్ వైఖరిని నిరసించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘భారత్లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని దిల్లీ కోరడం.. దానికి అనుగుణంగా కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విభేదాల పరిష్కారానికి దౌత్యవేత్తలు విధుల్లో ఉండటం అవసరం. కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని ఒత్తిడి తేవద్దని మేం ఇప్పటికే భారత్ను కోరాం. అంతేకాకుండా నిజ్జర్ హత్య అంశంలో కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని అభ్యర్థించాం. 1961 నాటి వియన్నా ఒప్పందాన్ని భారత్ పాటించాలి. కెనడా దౌత్య మిషన్లో గుర్తింపు పొందిన సభ్యులకు లభించే అధికారాలు, దౌత్యపరమైన రక్షణ వారికి కల్పించాలి’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
భారత్ నిర్ణయాలతో ఏకీభవించం: బ్రిటన్
సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన దృష్ట్యా కెనడా దౌత్యవేత్తలు భారత్ నుంచి నిష్క్రమించడంపై బ్రిటన్ ప్రభుత్వం తన అసమ్మతిని వ్యక్తం చేసింది. ‘‘భారత్ నుంచి కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకునేలా దిల్లీ తీసుకున్న నిర్ణయాన్ని మేం అంగీకరించలేం. దౌత్యవేత్తలకు కల్పించే రక్షణను ఏకపక్షంగా ఎత్తివేయడం.. వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా లేదు’’ అని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అమెరికా తొలుత తటస్థంగా వ్యవహరించినా.. ఆ తర్వాత కెనడాకు మద్దతుగా పలుమార్లు వ్యాఖ్యలు చేసింది.
వియన్నా ఒప్పందానికి విరుద్ధం కాదు: భారత్
భారత్లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యులతో సహా వెనక్కి పిలిపించుకున్న కెనడా.. దౌత్యవేత్తలకు రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్ చేసిన హెచ్చరికను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే, వియన్నా ఒప్పందానికి అనుగుణంగానే దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వం అమలుకు ఈ చర్యలు తీసుకున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
పెద్దఎత్తున నిరసనలతో ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అట్టుడికింది. విద్యుత్ బిల్లులపై అధిక పన్నులు, ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన వారిపై భద్రతా బలగాలు అణచివేతకు దిగాయి. -
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
సిబ్బంది నిర్లక్ష్యం.. అప్పటికే తీరని దుఖంలో ఉన్న ఓ కుటుంబాన్ని మరింత ఆవేదనలోకి నెట్టింది. -
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 300 మంది మృతి..!
భారీగా కురిసిన వర్షాలతో అఫ్గానిస్థాన్(Afghanistan) అల్లాడిపోతోంది. దాంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ క్రమంలో అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగాధిపతిని పదవి నుంచి తప్పించింది. -
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.