స్ట్రైకర్.. శత్రు భయంకర్!
యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట శకటాల విషయంలో దశాబ్దాలుగా రష్యాపై ఆధారపడ్డ భారత్.. ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోంది.
యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట శకటాల విషయంలో దశాబ్దాలుగా రష్యాపై ఆధారపడ్డ భారత్.. ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోంది. చైనాకు చెక్ పెట్టేందుకు అధునాతన ఆయుధాలను మోహరించాలన్న వ్యూహంలో భాగంగా ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. భూతల పోరులో కీలకమైన సాయుధ శకటాలను అగ్రరాజ్యంతో కలిసి ఉమ్మడిగా ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
భారత్, అమెరికాల విదేశీ వ్యవహారాలు, రక్షణ మంత్రులతో శుక్రవారం జరిగిన ‘2+2 సంప్రదింపుల భేటీ’లో ఇది ప్రధానాంశమైంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే.. అధునాతన ‘స్ట్రైకర్’ సాయుధ శకటాలు మన ఆర్మీకి అందుతాయి. దీనివల్ల సైనికపరంగా భారత్కు ప్రయోజనం కలగడంతోపాటు దేశీయ ఆయుధ ఉత్పాదక రంగానికి ఊతం లభించనుంది. చైనాతోపాటు పాకిస్థాన్ సరిహద్దుల్లోనూ వీటిని మోహరించే అవకాశం ఉంది.
ఏమిటీ స్ట్రైకర్?
ఇది 8 చక్రాలతో నడిచే సాయుధ పోరాట శకటం. జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అమెరికా సైన్యం కోసం కెనడా, బ్రిటన్లోని కర్మాగారాల్లో ఇవి తయారవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా సైనికుడు స్టువార్ట్ ఎస్ స్ట్రైకర్, వియత్నాం పోరులో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రాబర్ట్ ఎఫ్ స్ట్రైకర్ల పేరును ఈ శకటానికి ఖరారు చేశారు. స్ట్రైకర్ శకటాలను అమెరికా.. ఉక్రెయిన్కు కానుకగా అందించింది. బ్రాడ్లీ శకటాలు, అబ్రామ్స్ ట్యాంకులతో కలిసి వీటిని కూడా రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తోంది.
శత్రు భూభాగంలోకి నిర్భయంగా..
దాడులను కాచుకుంటూ మన పదాతి దళ సైనికులను శత్రు భూభాగంలోకి, వారికి చేరువలోకి పంపడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఈ పనిని మెరుపు వేగంతో స్ట్రైకర్ నిర్వహించగలదు. ఈ క్రమంలో ప్రత్యర్థిపై విరుచుకుపడగలదు. ట్యాంకులు, ఇతర భారీ సాయుధ శకటాల కన్నా ఇది తేలికైంది. అందువల్ల ఎలాంటి భూభాగంలోనైనా ఒడుపుగా ప్రయాణించగలదు. ఈ లక్షణాల దృష్ట్యా ఇది శత్రుభీకర ఆయుధంగా తయారైంది. ఎలాంటి అవసరాలకైనా ఇది అద్భుతంగా సరిపోలుతుంది. దీని నిర్వహణకు పెద్దగా మౌలిక వసతులు అవసరంలేదు.
దుర్భేద్య కవచం
స్ట్రైకర్కు పటిష్ఠ కవచం ఉంది. అన్ని వైపుల నుంచీ ఇది రక్షణ కల్పిస్తుంది. ఎలాంటి రక్షణ లేని బహిరంగ ప్రదేశాల్లో ఇది శత్రుదాడుల నుంచి కాపాడుతుంది. పట్టణ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఆకస్మిక దాడుల నుంచి రక్షిస్తుంది. 14.5 ఎంఎం తూటాలు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. శత్రు బంకర్లు, గోడలను ధ్వంసం చేసుకొని ముందుకు వెళ్లగలదు. పెద్దగా శబ్దం చేయదు. ఈ వాహనానికి 4 వీల్ డ్రైవ్ వెసులుబాటు ఉంది. అవసరమైతే 8 వీల్ డ్రైవ్లోకి కూడా మారొచ్చు. బురదలో చిక్కుకుపోయినా సొంతంగా బయటకు వచ్చే సెల్ఫ్ రికవరీ సామర్థ్యం దీని సొంతం. భిన్న భూభాగాలకు అనుగుణంగా టైర్లలో పీడనాన్ని సర్దుబాటు చేయడానికి ‘కేంద్రీకృత టైర్ ఇన్ఫ్లేషన్’ వ్యవస్థ కూడా ఉంది.
మెరుగైన ఆయుధాలు
స్ట్రైకర్లో శక్తిమంతమైన ఆయుధాలను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి పాయింట్ 50 క్యాలిబర్ కలిగిన ఎం2 మెషీన్ గన్ లేదా ఎంకే19 40 ఎంఎం గ్రెనేడ్ లాంచర్ను అమర్చవచ్చు. అవి ప్రొటెక్టెడ్ రిమోట్ వెపన్ స్టేషన్లో ఉంటాయి. వాహనంపైకి రాకుండా లోపలి నుంచే వీటిని సైనికులు పేల్చవచ్చు. ఈ శకటానికి 30ఎంఎం శతఘ్నిని కూడా అమెరికా సైన్యం జోడించింది. లేజర్లను ప్రయోగించే డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలనూ మోహరించేందుకు కసరత్తు చేస్తోంది. సమీపంలోని యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 105 ఎంఎం మొబైల్ గన్నూ ఏర్పాటు చేస్తోంది. వీటివల్ల సైనిక కార్యకలాపాల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి వీలవుతుంది. ఈ సాయుధ వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చుకొని.. సింహభాగానికి ట్యాంకు విధ్వంసక క్షిపణి వ్యవస్థలను అమర్చాలని భారత్ భావిస్తోంది. మిగతా వాటిని యుద్ధంలో నిఘాకు, ఆదేశిక వ్యవస్థకు ఉపయోగిస్తారు.
భిన్న అవసరాలు తీర్చేలా..
స్ట్రైకర్లను యుద్ధరంగంలో భిన్న అవసరాలకు ఉపయోగించొచ్చు. పూర్తిస్థాయిలో సాయుధులైన 9 మంది పదాతి దళ సైనికులను కదనక్షేత్రంలోకి తరలించగలదు. క్షతగాత్రులను క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి, యుద్ధరంగంలో ఇంజినీరింగ్ సంబంధ తోడ్పాటు అందించడానికి ఉపయోగపడగలదు. కదనరంగంలో నిఘాకు, శత్రువులపై మోర్టార్, శతఘ్ని దాడులు చేయడానికి, ప్రత్యర్థులున్న ప్రదేశాన్ని నిర్దిష్టంగా పసిగట్టి, సరిగ్గా ఆ ప్రదేశంపైకి కాల్పులు జరిపేలా సైన్యానికి సాయపడుతుంది. అణు, జీవ, రసాయన ఆయుధాలతో దాడి జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలనలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ మేరకు స్ట్రైకర్లో భిన్న వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
- ఇంజిన్: క్యాటర్పిల్లర్ సీ7, 350 హెచ్పీ
- సిబ్బంది: ఇద్దరు
- వేగం: గంటకు 100 కిలోమీటర్లు
- పరిధి: 480 కిలోమీటర్లు
- బరువు: 19 టన్నులు
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్న తరుణంలో కమలా హారిస్(Kamala Harris)కు భారీగా మద్దతు లభిస్తోంది. -
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు