స్ట్రైకర్.. శత్రు భయంకర్!
యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట శకటాల విషయంలో దశాబ్దాలుగా రష్యాపై ఆధారపడ్డ భారత్.. ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోంది.
యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట శకటాల విషయంలో దశాబ్దాలుగా రష్యాపై ఆధారపడ్డ భారత్.. ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోంది. చైనాకు చెక్ పెట్టేందుకు అధునాతన ఆయుధాలను మోహరించాలన్న వ్యూహంలో భాగంగా ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. భూతల పోరులో కీలకమైన సాయుధ శకటాలను అగ్రరాజ్యంతో కలిసి ఉమ్మడిగా ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
భారత్, అమెరికాల విదేశీ వ్యవహారాలు, రక్షణ మంత్రులతో శుక్రవారం జరిగిన ‘2+2 సంప్రదింపుల భేటీ’లో ఇది ప్రధానాంశమైంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే.. అధునాతన ‘స్ట్రైకర్’ సాయుధ శకటాలు మన ఆర్మీకి అందుతాయి. దీనివల్ల సైనికపరంగా భారత్కు ప్రయోజనం కలగడంతోపాటు దేశీయ ఆయుధ ఉత్పాదక రంగానికి ఊతం లభించనుంది. చైనాతోపాటు పాకిస్థాన్ సరిహద్దుల్లోనూ వీటిని మోహరించే అవకాశం ఉంది.
ఏమిటీ స్ట్రైకర్?
ఇది 8 చక్రాలతో నడిచే సాయుధ పోరాట శకటం. జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అమెరికా సైన్యం కోసం కెనడా, బ్రిటన్లోని కర్మాగారాల్లో ఇవి తయారవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా సైనికుడు స్టువార్ట్ ఎస్ స్ట్రైకర్, వియత్నాం పోరులో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రాబర్ట్ ఎఫ్ స్ట్రైకర్ల పేరును ఈ శకటానికి ఖరారు చేశారు. స్ట్రైకర్ శకటాలను అమెరికా.. ఉక్రెయిన్కు కానుకగా అందించింది. బ్రాడ్లీ శకటాలు, అబ్రామ్స్ ట్యాంకులతో కలిసి వీటిని కూడా రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తోంది.
శత్రు భూభాగంలోకి నిర్భయంగా..
దాడులను కాచుకుంటూ మన పదాతి దళ సైనికులను శత్రు భూభాగంలోకి, వారికి చేరువలోకి పంపడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఈ పనిని మెరుపు వేగంతో స్ట్రైకర్ నిర్వహించగలదు. ఈ క్రమంలో ప్రత్యర్థిపై విరుచుకుపడగలదు. ట్యాంకులు, ఇతర భారీ సాయుధ శకటాల కన్నా ఇది తేలికైంది. అందువల్ల ఎలాంటి భూభాగంలోనైనా ఒడుపుగా ప్రయాణించగలదు. ఈ లక్షణాల దృష్ట్యా ఇది శత్రుభీకర ఆయుధంగా తయారైంది. ఎలాంటి అవసరాలకైనా ఇది అద్భుతంగా సరిపోలుతుంది. దీని నిర్వహణకు పెద్దగా మౌలిక వసతులు అవసరంలేదు.
దుర్భేద్య కవచం
స్ట్రైకర్కు పటిష్ఠ కవచం ఉంది. అన్ని వైపుల నుంచీ ఇది రక్షణ కల్పిస్తుంది. ఎలాంటి రక్షణ లేని బహిరంగ ప్రదేశాల్లో ఇది శత్రుదాడుల నుంచి కాపాడుతుంది. పట్టణ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఆకస్మిక దాడుల నుంచి రక్షిస్తుంది. 14.5 ఎంఎం తూటాలు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. శత్రు బంకర్లు, గోడలను ధ్వంసం చేసుకొని ముందుకు వెళ్లగలదు. పెద్దగా శబ్దం చేయదు. ఈ వాహనానికి 4 వీల్ డ్రైవ్ వెసులుబాటు ఉంది. అవసరమైతే 8 వీల్ డ్రైవ్లోకి కూడా మారొచ్చు. బురదలో చిక్కుకుపోయినా సొంతంగా బయటకు వచ్చే సెల్ఫ్ రికవరీ సామర్థ్యం దీని సొంతం. భిన్న భూభాగాలకు అనుగుణంగా టైర్లలో పీడనాన్ని సర్దుబాటు చేయడానికి ‘కేంద్రీకృత టైర్ ఇన్ఫ్లేషన్’ వ్యవస్థ కూడా ఉంది.
మెరుగైన ఆయుధాలు
స్ట్రైకర్లో శక్తిమంతమైన ఆయుధాలను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి పాయింట్ 50 క్యాలిబర్ కలిగిన ఎం2 మెషీన్ గన్ లేదా ఎంకే19 40 ఎంఎం గ్రెనేడ్ లాంచర్ను అమర్చవచ్చు. అవి ప్రొటెక్టెడ్ రిమోట్ వెపన్ స్టేషన్లో ఉంటాయి. వాహనంపైకి రాకుండా లోపలి నుంచే వీటిని సైనికులు పేల్చవచ్చు. ఈ శకటానికి 30ఎంఎం శతఘ్నిని కూడా అమెరికా సైన్యం జోడించింది. లేజర్లను ప్రయోగించే డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలనూ మోహరించేందుకు కసరత్తు చేస్తోంది. సమీపంలోని యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 105 ఎంఎం మొబైల్ గన్నూ ఏర్పాటు చేస్తోంది. వీటివల్ల సైనిక కార్యకలాపాల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి వీలవుతుంది. ఈ సాయుధ వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చుకొని.. సింహభాగానికి ట్యాంకు విధ్వంసక క్షిపణి వ్యవస్థలను అమర్చాలని భారత్ భావిస్తోంది. మిగతా వాటిని యుద్ధంలో నిఘాకు, ఆదేశిక వ్యవస్థకు ఉపయోగిస్తారు.
భిన్న అవసరాలు తీర్చేలా..
స్ట్రైకర్లను యుద్ధరంగంలో భిన్న అవసరాలకు ఉపయోగించొచ్చు. పూర్తిస్థాయిలో సాయుధులైన 9 మంది పదాతి దళ సైనికులను కదనక్షేత్రంలోకి తరలించగలదు. క్షతగాత్రులను క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి, యుద్ధరంగంలో ఇంజినీరింగ్ సంబంధ తోడ్పాటు అందించడానికి ఉపయోగపడగలదు. కదనరంగంలో నిఘాకు, శత్రువులపై మోర్టార్, శతఘ్ని దాడులు చేయడానికి, ప్రత్యర్థులున్న ప్రదేశాన్ని నిర్దిష్టంగా పసిగట్టి, సరిగ్గా ఆ ప్రదేశంపైకి కాల్పులు జరిపేలా సైన్యానికి సాయపడుతుంది. అణు, జీవ, రసాయన ఆయుధాలతో దాడి జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలనలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ మేరకు స్ట్రైకర్లో భిన్న వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
- ఇంజిన్: క్యాటర్పిల్లర్ సీ7, 350 హెచ్పీ
- సిబ్బంది: ఇద్దరు
- వేగం: గంటకు 100 కిలోమీటర్లు
- పరిధి: 480 కిలోమీటర్లు
- బరువు: 19 టన్నులు
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
-
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
-
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
-
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్