నవమాసాలు.. కృత్రిమ గర్భంలో..!
కొన్ని దశాబ్దాల కిందటితో పోలిస్తే ప్రస్తుతం పునరుత్పత్తి విధానాలు గణనీయంగా మారిపోయాయి. ఐవీఎఫ్; అండం, వీర్య దానాలు, గర్భాశయ మార్పిడి, అద్దె గర్భం (సరోగసీ), అండాన్ని శీతలీకరణతో నిల్వ చేయడం వంటి విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
తల్లి శరీరానికి వెలుపల పిండం వృద్ధి
శాస్త్రవేత్తల ముందడుగు
లండన్: కొన్ని దశాబ్దాల కిందటితో పోలిస్తే ప్రస్తుతం పునరుత్పత్తి విధానాలు గణనీయంగా మారిపోయాయి. ఐవీఎఫ్; అండం, వీర్య దానాలు, గర్భాశయ మార్పిడి, అద్దె గర్భం (సరోగసీ), అండాన్ని శీతలీకరణతో నిల్వ చేయడం వంటి విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా సంతానోత్పత్తికి ఇప్పుడు అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇంత పురోగతి సాధించినా.. పునరుత్పత్తికి సంబంధించిన ఒక అంశంలో ఇప్పటికీ ఎలాంటి మార్పులేదు. అది.. పిండాన్ని గర్భంలోనే వృద్ధి చేయాల్సిన ఆవశ్యకత! ఆ ప్రక్రియలోనూ నూతన ఆవిష్కరణల దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. తల్లి శరీరానికి వెలుపల పిండాన్ని వృద్ధి చేసే అంశంలో కొన్ని విజయాలు సాధించారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సమాజంలో అనేక మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏమిటీ విధానం?
అండం, వీర్య కణ కలయికతో ఏర్పడే పిండం.. పూర్తిస్థాయి శిశువుగా వృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది. ఇదంతా తల్లి గర్భశయంలోనే జరగాలి. దానికి భిన్నంగా శరీరానికి వెలుపల పిండం వృద్ధి చేయడాన్ని ఎక్టోజెనెసిస్ అంటారు. అది ఇప్పటివరకూ సైన్స్ కాల్పనిక సాహిత్యానికే పరిమితమైంది. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ గర్భాశయాలను అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఈ దిశగా జంతువులపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. గొర్రెల పిండాలను విజయవంతంగా ఈ పద్ధతితో వృద్ధి చేశారు.
మరోవైపు సిమ్యులేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి నెదర్లాండ్స్లో ఇదే తరహా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు, కంప్యూటర్ మోడలింగ్తో కూడిన మనిషి బొమ్మను ఉపయోగించి.. నెలలు నిండకుండా ఒక శిశువు జన్మించడాన్ని అనుకరించి చూస్తున్నారు. తద్వారా.. తల్లి గర్భాన్ని పోలిన వాతావరణంలో పిండం వృద్ధి చెందే తీరును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
నెలలు నిండకుండా జన్మించిన చిన్నారుల ప్రాణాలను రక్షించడానికి ఈ విధానాన్ని ఉపయోగించాలన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ పరిశోధనలు చేస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల తర్వాత ఇవి పూర్తిస్థాయి ఎక్టోజెనెసిస్ను అందుబాటులోకి తీసుకురావొచ్చని వారు చెబుతున్నారు. తద్వారా.. పిండం ఏర్పడటం నుంచి శిశు జననం వరకూ.. ప్రక్రియ మొత్తం పూర్తిగా మానవ శరీరానికి వెలుపలే జరగడానికి మార్గం సుగమం కావొచ్చని పేర్కొంటున్నారు.
ప్రయోజనాలు..
- కృత్రిమ గర్భం.. పునరుత్పత్తికి సంబంధించి ప్రజలు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మహిళలు తమ అండాలను నిల్వ చేసుకొని, భవిష్యత్లో మాతృత్వాన్ని పొందేందుకు వాటిని ఉపయోగించుకునే విధానం ఇప్పుడు అందుబాటులో ఉంది. అదేరీతిలో కృత్రిమ గర్భం కూడా.. సంతానోత్పత్తికి ఒక కొత్త సాధనంగా మారుతుంది.
- ఏకకాలంలో బహుళ పిండాలను వృద్ధి చేసుకోవడానికీ ఈ పరిజ్ఞానం వీలు కల్పిస్తుంది. తద్వారా ఒకేసారి తాము అనుకున్న సంఖ్యలో సంతానాన్ని పొందడానికి జంటలకు వీలవుతుంది.
- ఒంటరి పురుషులు, స్వలింగ సంపర్క జంటలు, అనారోగ్య కారణాల వల్ల గర్భాన్ని ధరించలేని మహిళలూ ఈ విధానంతో సంతానాన్ని పొందొచ్చు.
- గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో ఎదురయ్యే అవకాశమున్న కొన్ని ఇబ్బందుల నుంచి మహిళలు విముక్తి పొందొచ్చు.
న్యాయపరమైన ఇబ్బందులు..
పూర్తిస్థాయిలో కృత్రిమ గర్భాన్ని సాకారం చేయడానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి. కొన్నిచోట్ల పిండాలకు సంబంధించిన పరిశోధనలను పూర్తిగా నిషేధించారు. పరిశోధనల కోసం మానవ పిండాలను 14 రోజులకు మించి వృద్ధి చేయకూడదన్న నిబంధనలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. అందువల్ల ఎక్టోజెనెసిస్పై పరిశోధనలు పూర్తిస్థాయిలో సాగాలంటే శాసనపరమైన మార్పులు అవసరం. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. కృత్రిమ గర్భాలను ప్రజలు స్వాగతిస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ అంశంపై తలెత్తే నైతిక, సామాజిక సంబంధ ప్రశ్నలకూ సమాధానాలు లభించాల్సి ఉంది.
కృత్రిమ గర్భాలతో దీర్ఘకాల నిబంధనలు భారీగా మారిపోవచ్చు. ఇలాంటి విధానంలో.. కన్నతల్లి అనే భావన ఉండదు. అందువల్ల సంబంధిత శిశువుకు చట్టబద్ధ తల్లి ఎవరన్నదానిపై విస్పష్ట నిర్వచనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కృత్రిమ గర్భాల ఆలోచనను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం దీన్ని ప్రమాదకరమైన పోకడగా అభివర్ణిస్తున్నారు. సంప్రదాయ కుటుంబ నిర్మాణాలు, విలువలకు ముప్పుగా భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు