యుద్ధాన్ని విస్తరించిన ఇజ్రాయెల్
గాజాపై ఇజ్రాయెల్ దాడులను విస్తరిస్తోంది. సోమవారం అటు వైమానిక, ఇటు భూతల దాడులను పెంచింది.
సురక్షిత ప్రాంతాల కోసం పాలస్తీనీయుల పరుగు
భారీగా వైమానిక, భూతల దాడులు
డెయిర్ అల్-బలా: గాజాపై ఇజ్రాయెల్ దాడులను విస్తరిస్తోంది. సోమవారం అటు వైమానిక, ఇటు భూతల దాడులను పెంచింది. దక్షిణ గాజా పట్టణమైన ఖాన్ యూనిస్ నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనీయులను హెచ్చరించింది. దీంతో వారంతా సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఉత్తర గాజా నుంచి వచ్చిన వారంతా మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. ‘గాజా వ్యాప్తంగా హమాస్ స్థావరాలే లక్ష్యంగా మా దాడులను విస్తరిస్తున్నాం. మా భూభాగంపై ఎవరు దాడి చేసినా.. వారిపై తీవ్రంగా ప్రతి దాడి చేస్తాం. అదే మా విధానం’ అని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ఆదివారం రాత్రి దాదాపు 200 హమాస్ లక్ష్యాలపై వైమానిక దళం బాంబులు వేసింది. ఐడీఎఫ్ దళాల భూతల ఆపరేషన్కు మద్దతుగా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజాలోని బెయిట్ హనౌన్లో ఉన్న ఓ పాఠశాలలో హమాస్ స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. దీనినే ఇజ్రాయెల్ దళాలపై దాడులకు వాడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో 15,890 మంది పాలస్తీనీయులు మరణించారు. 42,000 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 70శాతం మంది మహిళలు, పిల్లలే.
హమాస్ చెరలో బందీ హత్య
బందీగా ఉన్న యోనాథన్ సమరానో అనే యువకుడిని హమాస్ హత్య చేసినట్లు అతడి కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్ దళాలు సమాచారం అందజేశాయి. అతడి మృతదేహం ఇప్పటికీ హమాస్ ఆధీనంలోనే ఉందని పేర్కొన్నాయి. అక్టోబరు 7న నోవా మ్యూజిక్ ఫెస్టివల్పై హమాస్ దాడి చేసిన సమయంలో అతడిని హమాస్ కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత అతడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఒక ఇంట్లో బందీగా ఉన్నానని పేర్కొన్నారు. అనంతరం అతడితో సంబంధాలు తెగిపోయాయి. కొన్నాళ్లకు అతడితోపాటు ఉన్న మిత్రుల మృతదేహాలు బయటపడ్డాయి. అతడిని కూడా హమాస్ కాల్చేసినట్లు తర్వాత తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. -
హమాస్.. ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హమాస్తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరారు.