శిలాజ ఇంధనాలకు స్వస్తి చెబుదాం
ఐక్యరాజ్య సమితి కాప్-28 సదస్సులో వాతావరణ చర్చలపై తొలి రోజు గణనీయమైన పురోగతి కనిపించినా ఆ తరువాత పరిస్థితి ముందుకూ వెనక్కూ అన్నట్లు ఊగిసలాడుతోంది.
అధిక దేశాల ఆకాంక్ష
కాప్-28 సదస్సులో చర్చ
దుబాయ్: ఐక్యరాజ్య సమితి కాప్-28 సదస్సులో వాతావరణ చర్చలపై తొలి రోజు గణనీయమైన పురోగతి కనిపించినా ఆ తరువాత పరిస్థితి ముందుకూ వెనక్కూ అన్నట్లు ఊగిసలాడుతోంది. పేద దేశాలకు వాతావరణ మార్పులవల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి 72 కోట్ల డాలర్లతో పరిహార నిధిని తొలి రోజు ఏర్పాటు చేశారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాలను పరిహరించాలంటే మరెన్నో వందల కోట్ల డాలర్లు అవసరమవుతాయని ఐరాస వాతావరణ కార్యదర్శి సైమన్ స్టియెల్ బుధవారం వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పుల నిరోధానికి కాప్-28 బుల్లెట్ రైలులా దూసుకుపోవాల్సి ఉండగా, పాతకాలపు పొగబండిలా తుప్పు పట్టిన పట్టాలపై ముక్కుతూ మూలుగుతూ కదలుతోందని పేర్కొన్నారు. భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీలవద్ద స్థిరీకరించాలన్న పారిస్ తీర్మానం అమలులో ఎంతవరకు ప్రగతి సాధించామనేది దుబాయ్ సదస్సులో సమీక్షించబోతున్నారు. కానీ ఈ సమీక్షా పత్రం ముసాయిదాలో వాడాల్సిన పదజాలం మీద తర్జనభర్జన జరుగుతోంది. తమ డిమాండ్లు, అభ్యంతరాలను ఈ ముసాయిదా ఎంతవరకు పట్టించుకుంటుందో 197 దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. భూతాపానికి కారణమైన బొగ్గు, చమురు, సహజ వాయువులను పూర్తిగా వదిలించుకోవాల్సిన అవసరాన్ని మొట్టమొదటిసారి కాప్ ముసాయిదాలో చేర్చడం విశేషం. కానీ ఈ లక్ష్య సాధనకు గడువుపైనా, ముసాయిదాలో వాడే పదజాలంపైనా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. శిలాజ ఇంధనాలకు దశలవారీగా స్వస్తి చెప్పాలని 106 దేశాలు ఆశిస్తున్నాయి. కానీ ఈ ఇంధనాలకు పూర్తిగా స్వస్తి చెప్పాలని ఆయిల్ ఛేంజ్ ఇంటర్నేషనల్కు చెందిన పర్యావరణ వేత్త రొమైన్ లూలాలెన్ ఉద్ఘాటించారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా తగ్గించడానికి సౌదీ అరేబియా, ఇరాక్, తుర్కియేలు సుముఖంగా ఉన్నాయి.. తప్ప దశలవారీగా స్వస్తి చెప్పాలనే అంశం మీద వాటికి అభ్యంతరాలున్నాయి. భూతాపం పెరగడానికి రెండో పెద్ద కారణం.. రవాణా రంగం. కాబట్టి శిలాజ ఇంధనాలను విడనాడి విద్యుత్తు వాహనాలవైపు మళ్లాల్సిన ఆవశ్యకతపై కాప్-28 సదస్సు దృష్టి సారిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి