ఖాన్ యూనిస్లో హోరాహోరీ
గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు హమాస్ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్లోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై విరుచుకుపడుతోంది.
హమాస్ అధిపతి యాహ్య సిన్వర్కు చేరువలో ఇజ్రాయెల్ దళాలు
రేపో మాపో పట్టుకుంటాం: ఐడీఎఫ్
రఫా: గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు హమాస్ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్లోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా పౌరులను హెచ్చరిస్తూ ఖాన్ యూనిస్లోని హమాస్ అధినేత యాహ్యా సిన్వర్కు చేరువవుతోంది. సిన్వర్ నివాసాన్ని ఐడీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయని ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే తాము ముట్టడించిన ప్రాంతంలో హమాస్ అధినేత లేరని ఐడీఎఫ్ తెలిపింది. అంగరక్షకులతో కలిసి ఆయన సొరంగాల్లో దాక్కున్నట్లు అనుమానిస్తోంది. 61 ఏళ్ల సిన్వర్ ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలోనే జన్మించారు. ఇస్లామిక్ కార్యకలాపాలు చేపడుతున్నందుకు తొలిసారి ఆయన 19 ఏళ్ల వయసులో అరెస్టయ్యారు. 1985లో మరోసారి అరెస్టయ్యారు. ఆ సమయంలోనే హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ విశ్వాసం చూరగొన్నారు. అక్కడినుంచి అంచెలంచెలుగా ఎదిగిన సిన్వర్ 2017 నుంచి గాజా అధిపతిగా కొనసాగుతున్నారు. 2015లో అమెరికా కూడా సిన్వర్ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
5 వేల మందిని హతమార్చాం
గాజాపై దాడి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 5 వేల మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం దగ్గర భీకర పోరు సాగుతోంది. ఈ దాడి సందర్భంగా భారీ స్థాయిలో హమాస్ ఉగ్రవాదులు లొంగిపోయారని ఐడీఎఫ్ పేర్కొంది. మరోవైపు ప్రస్తుత పోరు కారణంగా 18 లక్షల 70 వేల మంది గాజా వాసులు తమ ఇళ్లను వీడాల్సి వచ్చిందని ఐరాస పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 17 వేల 177 మంది మృతిచెందారని, 42 వేల మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
గాజాపై ఇజ్రాయెల్ విచక్షణారహితంగా చేస్తున్న దాడులను కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ సమాజంలో ఓ సభ్యురాలిగా భారత్ తన వంతు కర్తవ్యాన్ని పోషించాలని డిమాండ్ చేశారు.
భారత సంతతి ఇజ్రాయెలీ సైనికుడి మృతి
హమాస్తో గాజాలో జరుగుతున్న పోరులో భారత సంతతి ఇజ్రాయెలీ సైనికుడు గిల్ డానియెల్స్ (34) మృతి చెందారు. హీబ్రూ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫార్మసీలో మాస్టర్స్ చేసిన గిల్..యుద్ధం ప్రారంభం కాగానే ఇజ్రాయెలీ రిజర్వు సైన్యంలో చేరారు. గిల్తో పాటు.. మరో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. మహారాష్ట్ర మూలాలు కలిగిన గిల్ నిశ్చితార్థం నెల రోజుల క్రితం జరిగింది. గాజాపై భూతల దాడులు ప్రారంభించిన తర్వాత దాదాపు 88 మంది సైనికులను ఇజ్రాయెల్ కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!