రష్యాలో కాల్పులకు పాల్పడిన విద్యార్థిని.. ఒకరి మృతి

రష్యాలో ఓ పాఠశాల విద్యార్థిని(14) దారుణానికి పాల్పడింది. తుపాకీతో తన తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడింది.

Published : 08 Dec 2023 05:24 IST

మాస్కో: రష్యాలో ఓ పాఠశాల విద్యార్థిని(14) దారుణానికి పాల్పడింది. తుపాకీతో తన తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడింది. దీంతో ఒకరు మృతి చెందగా మరో అయిదుగురు గాయపడ్డారు. అనంతరం ఆ బాలిక తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉక్రెయిన్‌ సరిహద్దులోని బ్రియాన్స్క్‌ పాఠశాలలో గురువారం ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని