కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలింపు
గాజాస్ట్రిప్లో అదుపులోకి తీసుకుంటున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది.
వివాదాస్పదమవుతున్న ఇజ్రాయెల్ సైన్యం తీరు
టెల్అవీవ్/ఖాన్ యూనిస్: గాజాస్ట్రిప్లో అదుపులోకి తీసుకుంటున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. బందీల కళ్లకు గంతలు కట్టి.. చేతులు కట్టేసి కేవలం లోదుస్తుల్లో వారిని ట్రక్కుల్లో తరలించడం.. ఫొటోలు తీయడం.. వాటిని సామాజిక మాధ్యమాల్లో బహిరంగపరచడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గురువారం జబాలియా శరణార్థి శిబిరంపై దాడి సందర్భంగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) భారీ సంఖ్యలో పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం ఫొటోలను విడుదల చేశాయి. వీరంతా హమాస్ మిలిటెంట్లని, లొంగిపోయారని పేర్కొన్నాయి. అయితే ఇందులో సాధారణ పాలస్తీనా పౌరులే అధిక సంఖ్యలో ఉన్నారని వివిధ మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. బందీల పరిస్థితి దయనీయంగా ఉందని ‘యూరో-మెడిటేరియన్ హ్యూమన్రైట్స్ మానిటర్’ సంస్థ ఆరోపించింది. వలస వెళుతున్న వారిని, వైద్యులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వృద్ధులను ఇజ్రాయెల్ దళాలు ఏకపక్షంగా అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నాయని తెలిపింది. అల్-అరబి అల్-జదీద్ వార్తాసంస్థ ఈ ఫొటోలపై స్పందిస్తూ.. బందీల్లో తమ ప్రతినిధి కూడా ఒకరు ఉన్నారని వెల్లడించింది. వీరిని గాజాలోని అల్-అరబ్ కార్యాలయంలో ఇజ్రాయెల్ దళాలు అరెస్టు చేశాయని పేర్కొంది.
వీరిని అరెస్టు చేశాక దుస్తులు తొలగించి.. ఓ గుర్తుతెలియని ప్రదేశానికి తరలిస్తోందని వెల్లడించింది. ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారి మాట్లాడుతూ ‘‘మేము బందీలకు సంబంధించి చాలా ఫొటోలను చూశాం. వారు హమాస్ ఉగ్రవాదులు. ఇజ్రాయెల్ దళాలు గ్రౌండ్ ఆపరేషన్ సందర్భంగా వీరిని అరెస్టు చేశాయి. ఆ ప్రదేశంలో మిగిలిన హమాస్ దళాలు నిదానంగా బయటకు వస్తున్నాయి. ఈ చిత్రాల్లోని వారికి హమాస్తో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నాం. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు.గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం అత్యంత పురాతనమైన ఒమారి మసీదును ఐడీఎఫ్ దళాలు పేల్చివేశాయి. ఐదో శతాబ్దానికి చెందిన ఈ మసీదు.. గాజాస్ట్రిప్లో అతి పెద్దది. మరోవైపు వెస్ట్బ్యాంక్లో ఫరా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తాము అపహరించిన బందీలు చాలా మంది చనిపోయారని హమాస్ శుక్రవారం ప్రకటించింది. కొంత మందికి గాయాలు కూడా అయ్యాయని తెలిపింది. ఈ మేరకు హమాస్ సాయుధ విభాగం ఖస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇరాక్లో అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్ దాడి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అత్యంత పటిష్ట భద్రతా వలయంలో ఉండే అమెరికా రాయబార కార్యాలయంపై శుక్రవారం ఉదయం రాకెట్ దాడి జరిగింది. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు. ఇందులో స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణనష్టం సంభవించలేదని అమెరికా, ఇరాక్ అధికారులు తెలిపారు. 14 రాకెట్లు ప్రయోగించగా, అందులో ఒకటి ఎంబసీ గేట్ను తాకిందని చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యాక ఇరాక్లోని అగ్రరాజ్య రాయబార కార్యాలయంపై జరిగిన తొలి దాడి ఇదే. ఇప్పటివరకు అమెరికాకు వ్యతిరేకంగా 78 దాడులు జరిగాయని, ఇరాక్లో 37, సిరియాలో 41 దాడులు జరిగాయని యూఎస్ మిలిటరీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్