మానవ మెదడును అనుకరించొచ్చు!
మానవ మెదడు ఓ అద్భుతం! ప్రకృతి తీర్చిదిద్దిన ఈ యంత్రానికి ఎనలేని సామర్థ్యాలు ఉన్నాయి. దాన్ని అనుకరించే ఎలక్ట్రానిక్ సాధనాలను తయారుచేసి, మరింత మెరుగ్గా కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
సినాప్టిక్ ట్రాన్సిస్టర్ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
మానవ మెదడు ఓ అద్భుతం! ప్రకృతి తీర్చిదిద్దిన ఈ యంత్రానికి ఎనలేని సామర్థ్యాలు ఉన్నాయి. దాన్ని అనుకరించే ఎలక్ట్రానిక్ సాధనాలను తయారుచేసి, మరింత మెరుగ్గా కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ దిశగా అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం, బోస్టన్ కాలేజీ, మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. అత్యున్నత స్థాయి ఆలోచన సామర్థ్యం కలిగిన ‘సినాప్టిక్ ట్రాన్సిస్టర్’ను అభివృద్ది చేశారు. ఇది మానవ మెదడు తరహాలో ఏకకాలంలో సమాచారాన్ని ప్రాసెస్ చేయడంతోపాటు నిల్వ కూడా చేయగలదు. ఇది సాధారణ మెషీన్ లెర్నింగ్ విధుల నుంచి సంక్లిష్ట లక్ష్యాల వరకూ అనేక పనులను నిర్వహించగలదు.
మెదడు తరహా కంప్యూటర్ సాధనాలను అభివృద్ధి చేయడానికి గతంలోనూ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అయితే వారు రూపొందించిన ట్రాన్సిస్టర్లు అత్యంత శీతల ఉష్ణోగ్రతల్లో మాత్రమే పనిచేశాయి. తాజా సినాప్టిక్ ట్రాన్సిస్టర్ మాత్రం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా పనిచేసింది. అత్యంత వేగవంతమైన పనితీరును ఇది కనబరచగలదు. చాలా పరిమిత స్థాయిలో శక్తిని వినియోగించుకుంటుంది. విద్యుత్ సరఫరాను నిలిపివేసినా.. అప్పటికే నిల్వ చేసిన సమాచారాన్ని భద్రంగా కాపాడుతుంది.
ఎందుకు?
కృత్రిమ మేధ (ఏఐ)లో ఇటీవల చాలా పురోగతి సాధ్యమైంది. మానవ మెదడును అనుకరించే కంప్యూటర్లను అభివృద్ధి చేసేలా శాస్త్రవేత్తల్లో ఇది స్ఫూర్తి నింపింది. అయితే, డిజిటల్ కంప్యూటర్తో పోల్చినప్పుడు మెదడు నిర్మాణం చాలా భిన్నం. సంప్రదాయ డిజిటల్ కంప్యూటింగ్ సాధనాల్లో ప్రాసెసింగ్, స్టోరేజీ యూనిట్లు వేర్వేరుగా ఉంటాయి. దీనివల్ల మైక్రోప్రాసెసర్కు మెమరీకి మధ్య డేటా రాకపోకలు సాగించాలి. ఇందుకు చాలా విద్యుత్ ఖర్చువుతుంది. ఏకకాలంలో బహుళ లక్ష్యాల నిర్వహణకు ఇది పెద్ద అవరోధం. దీనికి భిన్నంగా.. మెదడులో జ్ఞాపకశక్తి, సమాచార ప్రాసెసింగ్ వ్యవస్థలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఫలితంగా ఆ అవయవంలో శక్తి వినియోగం చాలా తక్కువగా జరుగుతుంది.
అదే రీతిలో తక్కువ విద్యుత్తో డేటాను ప్రాసెస్ చేసే సరికొత్త విధానాల కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం మెమరీ రెసిస్టర్ (మెమ్రిస్టర్) అనేది అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానం. అది ఏకకాలంలో ప్రాసెసింగ్, మెమరీ విధులను నిర్వర్తించగలదు. అయినా కొన్ని అంశాల్లో అది విద్యుత్ను ఎక్కువగానే వినియోగించుకుంటోంది. ప్రస్తుత ‘బిగ్డేటా శకం’లో జరిగే డిజిటల్ కంప్యూటింగ్ తాకిడికి విద్యుత్ గ్రిడ్పై భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సరికొత్త హార్డ్వేర్ ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్ విధులకు ఇది చాలా అవసరం.
పలుచటి ఆకృతులతో మాయ..!
మెదడు తరహాలో ఏకకాలంలో డేటా నిల్వ, సమాచార ప్రాసెసింగ్ను చేపట్టగల ట్రాన్సిస్టర్ రూపకల్పనకు ‘మోర్ ప్యాటర్న్స్’లో కొత్తగా వచ్చిన పురోగతిపై శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఈ విధానంలో రెండు రకాల ఆకృతులను.. ఒకదానిపై మరొకటి ఉంచుతారు. అప్పుడు.. విడివిడిగా ఆ పదార్థాలకు లేని కొన్ని లక్షణాలు ఈ ఉమ్మడి ఆకృతికి సమకూరుతాయి. ఆ పొరలను మెలితిప్పినప్పుడు ‘మోర్ ఆకృతి’ ఏర్పడుతుంది. ఫలితంగా అసాధారణ ఎలక్ట్రానిక్ లక్షణాలు దీని సొంతమవుతాయి. ఇదే పద్ధతిలో కొత్త పరికరాన్ని రూపొందించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
వారు చాలా పలుచగా ఉండే బైలేయర్ గ్రాఫీన్, హెక్సాగోనల్ బోరాన్ నైట్రైడ్ను ఉపయోగించారు. వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి, నిర్దేశిత కోణంలో మెలితిప్పారు. తద్వారా మోర్ ఆకృతిని ఏర్పరిచారు. దీనివల్ల ఆ ఉమ్మడి ఆకృతికి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద మానవ మెదడు తరహా ‘న్యూరోమార్ఫిక్ సామర్థ్యం’ సాధ్యమైంది. ఈ విధానం ద్వారా సరికొత్త సినాప్టిక్ ట్రాన్సిస్టర్ను రూపొందించారు.
పరీక్షల్లో భేష్..
ప్రస్తుత ఏఐ అల్గోరిథమ్స్ సామర్థ్యంతో పోలిస్తే వాస్తవ ప్రపంచ పరిస్థితులు చాలా సంక్లిష్టం. అందువల్ల తాజా సినాప్టిక్ ట్రాన్సిస్టర్కున్న అధునాతన సామర్థ్యాలను మరింత సంక్లిష్టమైన పరిస్థితుల మధ్య పరీక్షించారు.
- తొలుత పరిశోధకులు.. మూడు సున్నాలను వరుసగా పేర్చి ‘000’ అనే ఒక సంఖ్యాక్రమాన్ని ఈ సాధనానికి చూపారు. ఆ తర్వాత 111 లేదా 101 వంటి సంఖ్యా పోకడలను ఇచ్చి.. వాటిలో తాను నేర్చుకున్న తరహా సంఖ్యా పోకడలను గుర్తించాలని సూచించారు.
- తాను నేర్చుకున్నది 000 అనే సంఖ్యాక్రమం మాత్రమే అయినప్పటికీ ఈ సినాప్టిక్ ట్రాన్సిస్టర్ 111, 101ను చక్కగా విశ్లేషించింది. 101తో పోల్చినప్పుడు 111 అనే సంఖ్యాక్రమం.. తాను నేర్చుకున్న 000కు చాలా దగ్గరగా ఉందని అది గుర్తించింది.
- నిజానికి ఈ యంత్రం నేర్చుకున్న 000తో పోల్చినప్పుడు 111లో అంకెలు భిన్నం. అయినా ఒకే సంఖ్యను వరుసగా మూడుసార్లు అమర్చడం ఇందులో ఇమిడి ఉన్న పోకడ అని తాజా సినాప్టిక్ ట్రాన్సిస్టర్ గుర్తించింది. ఈ తరహా అత్యున్నత స్థాయి విషయగ్రహణ సామర్థ్యాన్ని ‘అసోసియేటివ్ లెర్నింగ్’గా పేర్కొంటారు. ఇదే తరహాలో పలురకాల సారూప్యతలను ఈ సాధనం విజయవంతంగా గుర్తించగలిగింది. అసంపూర్ణ అంకెల పోకడను ఇచ్చినప్పటికీ ఈ సాధనం అసోసియేటివ్ లెర్నింగ్ సామర్థ్యాన్ని చాటగలిగింది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే