ఎరుపెక్కిన ఎర్రసముద్రం
ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై నవంబరు నుంచి వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా హెలికాప్టర్ల దాడిలో 10 మంది హౌతీలు మృతి చెందారు.
రంగంలోకి అమెరికా హెలికాప్టర్లు
హౌతీల మూడు బోట్లు ధ్వంసం
10 మంది తిరుగుబాటుదారుల మృతి
బీరుట్: ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై నవంబరు నుంచి వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా హెలికాప్టర్ల దాడిలో 10 మంది హౌతీలు మృతి చెందారు. డెన్మార్క్ షిప్పింగ్ సంస్థ మెర్స్ హంగ్జౌ రవాణా నౌకను ఆదివారం హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం నాలుగు బోట్లలో నౌక సమీపానికి చేరుకున్నారు. ఈ సమయంలో మెర్స్ సిబ్బంది పంపిన సందేశాలతో రంగంలోకి దిగిన అగ్రరాజ్య హెలికాప్టర్లు కాల్పులు జరిపాయి. 3 బోట్లను ముంచివేశాయి. నాలుగో బోటు సంఘటనా స్థలం నుంచి తప్పించుకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో 10 మంది హౌతీలు మరణించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత మెర్స్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. 48 గంటల పాటు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘటనపై అమెరికా స్పందిస్తూ.. శనివారం కూడా మెర్స్ రవాణా నౌకపై హౌతీలు క్షిపణులను ప్రయోగించారని.. వాటిని తాము తిప్పికొట్టామని తెలిపింది. మళ్లీ ఆదివారం చిన్న బోట్లతో దాడికి ప్రయత్నించారని పేర్కొంది. అమెరికా దాడిపై హౌతీ తీవ్రంగా స్పందించింది. ఎర్రసముద్రంలో అమెరికా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 100 మంది మృతి చెందారని, 286 మంది గాయాలయ్యాయని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. గాజాపై తాము చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.
అప్రమత్తమైన భారత్..
దిల్లీ: అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతోన్న నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది. నిఘాను మరింత పెంచింది. యుద్ధనౌకలను, ఇతర వ్యవస్థలను మోహరిస్తున్నట్లు పేర్కొంది. ‘‘ఎర్ర సముద్రం, ఏడెన్ సింధుశాఖ, మధ్య/ఉత్తర అరేబియా సముద్రంలో గత కొన్ని వారాలుగా వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. ఎంవీ రూయెన్, ఎంవీ కెమ్ ప్లూటోలపై జరిగిన దాడులు భారత్ ఈఈజీ (ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్) సమీపానికి చేరినట్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి దాడులను దీటుగా తిప్పికొట్టేందుకు గాను సముద్ర నిఘాను గణనీయంగా పెంచాం’ అని భారత నౌకాదళం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
-
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
-
భోజనానికి ముందు టీ, కాఫీ తాగుతున్నారా.. బీ అలర్ట్!
-
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య