రక్షణ ఉత్పత్తుల తయారీలో సహకారం
సైనిక అవసరాలను తీర్చే పలు రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీలో కలిసి పనిచేయాలని భారత్-గ్రీస్ దేశాలు నిర్ణయించాయి. సాంకేతిక నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల రాకపోకలు రెండు దేశాల మధ్య సాఫీగా కొనసాగేందుకు అవసరమైన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చాయి.
వివిధ రంగాల్లో కలిసి పనిచేయాలని భారత్-గ్రీస్ నిర్ణయం
దిల్లీలో రెండు దేశాల ప్రధానుల భేటీ
దిల్లీ: సైనిక అవసరాలను తీర్చే పలు రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీలో కలిసి పనిచేయాలని భారత్-గ్రీస్ దేశాలు నిర్ణయించాయి. సాంకేతిక నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల రాకపోకలు రెండు దేశాల మధ్య సాఫీగా కొనసాగేందుకు అవసరమైన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చాయి. మన దేశ పర్యటనకు వచ్చిన గ్రీస్ ప్రధాని కిరియాకొస్ మిట్సోటకిస్ బుధవారం దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడంపై తాము విపులంగా చర్చించుకున్నట్లు ప్రధాని మోదీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనీషియేటివ్లో భాగస్వామి కావాలని గ్రీస్ నిర్ణయించుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ముప్పు, ఐరోపాలోని తాజా పరిస్థితులు... ముఖ్యంగా ఉక్రెయిన్ సంక్షోభంపై, భారత్-పశ్చిమాసియా-ఐరోపా నడవా ద్వారా అనుసంధానాన్ని ఏర్పచుకునే విషయంపైనా వారిద్దరూ మాట్లాడకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా విలేకరులకు తెలిపారు. భారత్-గ్రీస్ల మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, శాంతి, సుస్థిరతల పరిరక్షణలో భారత్ పాత్ర అత్యంత కీలకమైనదని గ్రీస్ ప్రధాని పేర్కొన్నారని వినయ్ క్వాట్రా వెల్లడించారు. ఫార్మా, వైద్య పరికరాలు, ఆధునిక సాంకేతికత, నవ్యావిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, అంతరిక్ష రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాల అగ్రనేతలు నిర్ణయించారు. స్టార్టప్ల అనుసంధానతపైనా చర్చించుకున్నారు. ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ గ్రీస్ను సందర్శించగా...ఇప్పుడు ఆ దేశ ప్రధాని భారత్ పర్యటనకు వచ్చారు. ప్రధాని మోదీతో చర్చల(రైసినా డైలాగ్)కు ముందు రాష్ట్రపతి భవన్ వద్ద కిరియాకొస్ మిట్సోటకిస్కు సాదర స్వాగతం లభించింది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ కూడా గ్రీస్ ప్రధానిని కలుసుకున్నారు.
మోదీ ప్రభుత్వ హయాంలో జిల్లాల మధ్య తగ్గిన ఆర్థిక అసమానతలు
పీఎం ఆర్థిక సలహా మండలి వెల్లడి
దిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ)-2 ప్రభుత్వ హయాంలో కన్నా ప్రధాని మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)-1 సర్కారు హయాంలో జిల్లాల మధ్య ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గిపోయాయని ఓ అధికారిక పత్రం పేర్కొంది. మోదీ పాలనలో జిల్లాలు గణనీయ పురోగతి సాధించాయని, సగటు అభివృద్ధి రేటు కన్నా ఇది 18 శాతం అధికమని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి రూపొందించిన కార్యాచరణ పత్రం వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్