సంక్షిప్త వార్తలు (4)
అమెరికా వ్యాప్తంగా టెలికం సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఏటీఅండ్టీ, క్రికెట్ వైర్లెస్, వెరిజోన్, టీ-మొబైల్తోపాటు ఇతర మొబైల్ నెట్వర్క్లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్ డిటెక్టర్ అనే నెట్వర్క్ ట్రాకింగ్ సైట్ వెల్లడించింది.
అమెరికా టెలికం సేవల్లో అంతరాయం
వాషింగ్టన్: అమెరికా వ్యాప్తంగా టెలికం సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఏటీఅండ్టీ, క్రికెట్ వైర్లెస్, వెరిజోన్, టీ-మొబైల్తోపాటు ఇతర మొబైల్ నెట్వర్క్లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్ డిటెక్టర్ అనే నెట్వర్క్ ట్రాకింగ్ సైట్ వెల్లడించింది. హ్యూస్టన్, అట్లాంటా, షికాగో, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, బ్రూక్లిన్ ప్రాంతాల్లోని వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం.
ట్రంప్ కన్నా హేలీకే ఎక్కువ ఎన్నికల నిధులు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి నామినేషన్ కోసం బరిలో ఉన్న భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ జనవరి నెలలో డొనాల్డ్ ట్రంప్ కన్నా ఎక్కువ విరాళాలు పొందగలిగారు. హేలీకి 1.15 కోట్ల డాలర్ల విరాళాలు లభించగా ట్రంప్ 88 లక్షల డాలర్లు మాత్రమే పొందగలిగారు. ఇంతవరకు ఆయన ఎన్నికల వ్యయం 1.15 కోట్ల డాలర్లు. అంటే, తనకు అందిన విరాళాలకన్నా ఎక్కువ ఖర్చయింది.
పాక్ పంజాబ్కు తొలి మహిళా సీఎం మరియం!
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పంజాబ్కు తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. శుక్రవారం ప్రావిన్షియల్ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 50ఏళ్ల మరియం పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
నత్రజనితో మరో మరణశిక్ష అమలుకు అలబామా యత్నాలు!
మాంట్గోమేరీ: నత్రజని వాయువును ఉపయోగించి మరో ఖైదీకి మరణశిక్ష విధించాలని అమెరికాలోని అలబామా రాష్ట్రం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గత నెల 25న కెన్నెత్ స్మిత్ అనే ఖైదీకి ఈ పద్ధతిలో మరణశిక్ష అమలు చేయడంతో వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. ఈ క్రమంలో అలబామా అటార్నీ జనరల్ స్టీవ్ మార్షల్ కార్యాలయం అలాన్ యూజీన్ మిల్లర్(59) అనే ఖైదీకి మరణశిక్ష అమలు తేదీని నిర్ణయించాలని అలబామా సుప్రీంకోర్టును బుధవారం కోరింది. నైట్రోజన్ హైపోక్సియా ద్వారా దీనిని అమలు చేస్తామని తెలిపింది. సబర్బన్ బర్మింగ్హామ్లో ముగ్గురిని కాల్చి చంపిన కేసులో మిల్లర్ దోషిగా తేలాడు. అయితే నత్రజని వాడకాన్ని నిరోధించాలని కోరుతూ మరొక మరణశిక్ష ఖైదీ వ్యాజ్యం దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు