చందమామపై తొలి ప్రైవేటు ల్యాండర్
అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’.. అంతరిక్ష రంగంలో చరిత్ర సృషించింది. చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా దించింది.
చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ
జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగిన ‘ఒడిస్సియస్’
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’.. అంతరిక్ష రంగంలో చరిత్ర సృషించింది. చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా దించింది. 1972లో అపోలో-17 యాత్ర తర్వాత అమెరికా ల్యాండర్ ఒకటి జాబిల్లిపై దిగడం ఇదే మొదటిసారి. దీంతో చంద్రుడిపై వాణిజ్య పరిశోధనల శకానికి తెరలేచినట్లయింది. ఇంట్యూటివ్ మెషీన్స్ రూపొందించిన ఒడిస్సియస్ అనే వ్యోమనౌక.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చందమామ దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. జాబిల్లికి చేరువయ్యే క్రమంలో కొద్దిసేపు వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయాయి. కమ్యూనికేషన్ల పునరుద్ధరణ తర్వాత ఒడిస్సియస్.. చందమామపై దిగినట్లు హ్యూస్టన్లోని కంపెనీ కమాండ్ సెంటర్లో ఇంజినీర్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకూ కమాండ్ సెంటర్లో ఉత్కంఠగా గడిపిన ఇంజినీర్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ల్యాండింగ్ సాఫీగా సాగిందని, వ్యోమనౌక నిటారుగా దిగిందని ఇంట్యూటివ్ మెషీన్స్ పేర్కొంది. ఒడిస్సియస్ నుంచి తొలి చిత్రాలను డౌన్లింక్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించింది. ఒడిస్సియస్లో అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఈ సంస్థకు చెందిన ఆరు పరిశోధన పరికరాలు ఉన్నాయి. అవి భవిష్యత్లో చంద్రుడిపైకి చేపట్టబోయే మానవసహిత యాత్రలకు బాటలు వేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికితోడు కొలంబియా స్పోర్ట్స్వేర్ సంస్థకు చెందిన ఇన్సులేటింగ్ జాకెట్ వస్త్రం, జెఫ్ కూన్స్ అనే శిల్పి చెక్కిన 125 మినీ చందమామలు కూడా వ్యోమనౌకలో ఉన్నాయి.
పనిచేసేది వారం
ఒడిస్సియస్.. వారంపాటు పనిచేస్తుంది. ఆ తర్వాత ల్యాండింగ్ ప్రదేశంలో రాత్రి మొదలవుతుంది. క్రమంగా చీకటి ఆవరిస్తుంది. దీంతో వ్యోమనౌక సౌరఫలకాల విద్యుదుత్పత్తి సాధ్యం కాదు. అలాగే తీవ్ర శీతల వాతావరణం నెలకొంటుంది. గత ఏడాది ఆగస్టులో భారత్కు చెందిన చంద్రయాన్-3 వ్యోమనౌక కూడా జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలోనే దిగిన సంగతి తెలిసిందే. చందమామపై దిగే ప్రైవేటు ల్యాండర్లను నిర్మించడానికి నాసా చేపట్టిన ‘కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్’ (సీఎల్పీఎస్) కార్యక్రమం కింద పలు కంపెనీలు కాంట్రాక్టులు పొందాయి. అవి రూపొందించే వ్యోమనౌకల్లో నాసా తన పరికరాలను పంపుతుంది. కాంట్రాక్టు సాధించిన సంస్థల్లో ఇంట్యూటివ్ మెషీన్స్ కూడా ఉంది. ఈ కంపెనీతో నాసా.. 11.8 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒడిస్సియస్ దిగువ భాగంలో తమ కంపెనీ ఉద్యోగుల పేర్లను చెక్కామని ఇంట్యూటివ్ మెషీన్స్ సీఈవో స్టీవ్ అల్టెమిస్ పేర్కొన్నారు. అవి జాబిల్లి ఉపరితలంపై ముద్రితమవుతాయని తెలిపారు. కార్బన్ ఫైబర్, టైటానియంతో తయారైన ఈ వ్యోమనౌక ఎత్తు 14 అడుగులు. దీన్ని గతవారమే భూమి నుంచి ప్రయోగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. -
హమాస్.. ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హమాస్తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరారు.