ఈ నెత్తుటి ధారలకు రెండేళ్లు
వేలమంది సైనికులు పిట్టల్లా రాలిపోయారు. ఆయుధ/మందుగుండు నిల్వలు కొవ్వొత్తుల్లా కరిగిపోయాయి. అమాయక ప్రజలు అనేకులు అసువులు బాశారు. ఇళ్లు, పెద్దపెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎన్నటికి ముగిసేనో..!
వేలమంది సైనికులు పిట్టల్లా రాలిపోయారు. ఆయుధ/మందుగుండు నిల్వలు కొవ్వొత్తుల్లా కరిగిపోయాయి. అమాయక ప్రజలు అనేకులు అసువులు బాశారు. ఇళ్లు, పెద్దపెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి. అయినా- ఆ విధ్వంసకాండకు ఇంకా తెరపడలేదు. ఐక్యరాజ్య సమితి వంటి ఘనత వహించిన సంస్థలు చేసేదేం లేక చేతులెత్తేస్తున్నవేళ.. సమీప భవిష్యత్తులో దానికి ముగింపు కనిపించడం లేదు కూడా! ఆ విధ్వంసకాండ మరేదో కాదు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం! అది శనివారంతో రెండేళ్లు పూర్తిచేసుకొని మూడో ఏడులోకి అడుగుపెడుతోంది.
ఎందుకు మొదలైందంటే..
అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తమ సరిహద్దుల దాకా విస్తరణకు ప్రణాళికలు రచిస్తూ పక్కలో బల్లెంలా తయారవుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్నారు. ఉక్రెయిన్ను భాగస్వామ్య దేశంగా చేర్చుకునేందుకు నాటో పావులు కదపడం ఆయనకు సుతరామూ నచ్చలేదు. ఈ ప్రయత్నాల్ని నిలువరించే ప్రణాళికల్లో భాగంగా.. తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడేవారిపై ఉక్రెయిన్ ప్రభుత్వం 2014 నుంచి మారణకాండకు పాల్పడుతోందని ఆరోపిస్తూ 2022 ఫిబ్రవరి 24న ‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’ పేరుతో యుద్ధాన్ని ప్రారంభించారు. డాన్బాస్ విమోచనం, నాజీయిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలని ఆయన ప్రకటించారు.
మాస్కో దూకుడు.. కీవ్ ప్రతిఘటన
కేవలం మూడు రోజుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా ఆక్రమించేస్తుందని.. యుద్ధం ఆరంభమైనప్పుడు పలువురు విశ్లేషకులు అంచనా వేశారు. కానీ రెండేళ్లు పూర్తయినా అది జరగలేదు. యుద్ధం తొలినాళ్లలో రష్యా దూకుడుగా వ్యవహరించింది. ఉత్తర, తూర్పు, దక్షిణ సరిహద్దుల నుంచి 2 లక్షలమంది సైనికులను ఉక్రెయిన్ భూభాగంలోకి పంపింది. వారు శతఘ్నులు, డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడ్డారు. పలు ప్రాంతాలను ఆక్రమిస్తూ కీవ్ శివార్ల వరకు వడివడిగా వెళ్లారు. ఆ నగరాన్ని ఆక్రమించడంలో మాత్రం విఫలమయ్యారు. 2022 మార్చి నెలాఖరుకు- ఉక్రెయిన్ ఎదురుదాడుల కారణంగా ఉత్తర, దక్షిణ భూభాగాల్లో వారు వెనక్కి వెళ్లారు. ఆక్రమణల సమయంలో రష్యా బలగాలు బుచా, ఇర్పిన్లలో తీవ్రస్థాయి దురాగతాలకు పాల్పడ్డాయి. వందలమంది అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. మరోవైపు- ఉక్రెయిన్లోని దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను తమ దేశంలో కలిపేసుకుంటున్నట్లు 2022 అక్టోబరు 5న పుతిన్ ప్రకటించారు. అయితే యుద్ధం తొలినాళ్లలో రష్యా దాడులను తప్పించుకోవడం/అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేసిన ఉక్రెయిన్ బలగాలు- అమెరికా, పశ్చిమ దేశాల నుంచి ఆయుధ సరఫరా పెరిగాక జోరు పెంచాయి. ఎదురుదాడులతో పుతిన్ సేనలకు గట్టి సవాలు విసిరాయి. ఖేర్సన్ నగరాన్ని 2022 నవంబరులో తిరిగి తమ వశం చేసుకున్నాయి. ఓ దశలో జపోరిజియాలోనూ పాగా వేసినా.. తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2023 జూన్ నుంచి చాన్నాళ్లపాటు ఉక్రెయిన్ బలగాలు మరింత దీటుగా ఎదురుదాడులు చేశాయి. క్రమంగా పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా తగ్గిపోవడంతో డీలాపడ్డాయి.
ఇప్పుడు రష్యా అయిదు షెల్స్ను కాలిస్తే.. ఉక్రెయిన్ ఒక్క షెల్ను మాత్రమే కాల్చగలుగుతోంది. దాదాపుగా ఆత్మరక్షణకే అది పరిమితమవుతోంది.
ఎప్పటికి ముగిసేనో..!
శాంతి కోసం రష్యా, ఉక్రెయిన్ బృందాలు యుద్ధం ఆరంభంలో చర్చలు జరిపాయి. 2022 ఏప్రిల్లోనే ఓ తాత్కాలిక ఒప్పందానికి అవి చేరువగా వచ్చినా.. చివరి క్షణాల్లో చుక్కెదురైంది. తర్వాత చర్చలు జరగలేదు. భద్రతామండలి సహా ఐక్యరాజ్య సమితిలోనూ సయోధ్యకు అడుగులు పడలేదు. చర్చలకు తాము సిద్ధమేనని పుతిన్ చెబుతున్నారు. కానీ ఇప్పటికే తాము ఆక్రమించిన ప్రాంతాలను వెనక్కి ఇవ్వబోమంటున్నారు. నాటో దేశాలు ఉక్రెయిన్కు సాయాన్ని నిలిపివేస్తే యుద్ధం రెండు వారాల్లో ముగుస్తుందని ఇటీవల పుతిన్ పేర్కొన్నారు. కీవ్కు సహాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లు అమెరికా కాంగ్రెస్లో స్తంభించిపోవడం ఇప్పుడు రష్యాకు అనుకూలంగా మారింది.
ప్రస్తుత పరిస్థితేంటి?
దాదాపు 1,500 కిలోమీటర్ల పొడవైన ఫ్రంట్లైన్ వెంబడి రష్యా ముమ్మర దాడులు కొనసాగిస్తోంది. దొనెట్స్క్ రీజియన్లో కీలక బఖ్ముత్ నగరాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు 2023 మేలో అది ప్రకటించింది. తాజాగా ఈ నెల 17న అవ్దివ్కా నగరాన్ని పుతిన్ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, షాహిద్ డ్రోన్ల దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. త్వరలోనే ఉక్రెయిన్ భూభాగంలోకి పుతిన్ సేనలు మరింతగా చొచ్చుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
3.15 లక్షలు
యుద్ధంలో మరణించిన/ గాయపడిన రష్యా సైనికుల సంఖ్య (అమెరికా అంచనా)
5 లక్షలు
మరణించిన/ గాయపడిన ఉక్రెయిన్ బలగాల సంఖ్య
10,200
రష్యా దాడులతో ఉక్రెయిన్లో మరణించిన సాధారణ పౌరుల సంఖ్య
17,800 కోట్ల డాలర్లు
ఉక్రెయిన్కు మిత్రపక్షాలు వివిధ రూపాల్లో ఇప్పటిదాకా అందించిన సాయం విలువ. దేశాలవారీగా చూస్తే ఇందులో అమెరికాదే సింహభాగం.
1.3 లక్షల కోట్ల డాలర్లు
యుద్ధంతో రష్యా ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం
21,100 కోట్ల డాలర్లు
యుద్ధంపై ఇప్పటిదాకా మాస్కో చేసిన ఖర్చు
15,500 కోట్ల డాలర్లు
ఈ ఏడాది జనవరి నాటికి ఉక్రెయిన్ మౌలిక వసతులకు కలిగిన నష్టం విలువ
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?