పారిస్‌ వీధుల్లో మళ్లీ ట్రాక్టర్లు

ఫ్రాన్స్‌లో మళ్లీ రైతులు కదం తొక్కారు. శుక్రవారం రాజధాని పారిస్‌లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.

Published : 24 Feb 2024 04:15 IST

పారిస్‌: ఫ్రాన్స్‌లో మళ్లీ రైతులు కదం తొక్కారు. శుక్రవారం రాజధాని పారిస్‌లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయానికి ప్రభుత్వం మరింత మద్దతు ఇవ్వాలని, నిబంధనలు సులభతరం చేయాలని గత కొంతకాలంగా ఫ్రాన్స్‌లోని రైతులే కాదు.. ఐరోపాలోని చాలా దేశాల అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. మూడు వారాల క్రితం కూడా ఫ్రాన్స్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. తాజా ర్యాలీలో ‘వ్యవసాయాన్ని రక్షించండి’ ‘పంటభూమిలో మరణ మృదంగం’ తదితర ప్లకార్డులను రైతులు ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని