రష్యాకు అండగా ఉత్తర కొరియా అధినేత
ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు అండగా ఉత్తరకొరియా అధినేత కిమ్ నిలబడ్డారు. మాస్కో మందుగుండు సామగ్రి కొరతను తీరుస్తున్నారు.
6,700 షిప్పింగ్ కంటైనర్లలో మాస్కోకు ఆయుధాలు తరలించిన కిమ్!
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు అండగా ఉత్తరకొరియా అధినేత కిమ్ నిలబడ్డారు. మాస్కో మందుగుండు సామగ్రి కొరతను తీరుస్తున్నారు. గతేడాది జులై మొదలుకొని ప్యాంగ్యాంగ్... దాదాపు 6,700 షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మాస్కోకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణకొరియా చెబుతోంది. ఆ దేశ మంత్రి షిన్ ఒన్ సిక్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ కంటైనర్లలో 30 లక్షల 152 ఎంఎం శతఘ్ని గుండ్లను, 5,00,000 వరకు 122 ఎంఎం రౌండ్స్ గానీ తరలించి ఉండొచ్చని పేర్కొన్నారు. ముడిపదార్థాలు, విద్యుత్తు కొరత కారణంగా ఉత్తర కొరియాలో ఆయుధ కర్మాగారాలు సామర్థ్యంలో 30శాతం మేరకే పనిచేస్తున్నాయి. కానీ, రష్యాకు తరలించే గుండ్లను మాత్రం వేగంగా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఉ.కొరియా మరో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనున్నట్లు తెలుస్తోందన్నారు. దీనికి రష్యా పూర్తిస్థాయిలో సహకరిస్తోందని ఆరోపించారు. వైమానిక, ఇతర పరికరాల సాంకేతికతను కిమ్ సర్కారు అడుగుతోందని చెప్పారు. మరోవైపు అమెరికా విదేశాంగశాఖ లెక్కలు మాత్రం ఇంతకంటే అధికంగా ఉన్నాయి. గత సెప్టెంబర్ మొదలుకొని ఉత్తరకొరియా నుంచి దాదాపు 10 వేల కంటైనర్లలో ఆయుధాలు రష్యాకు సరఫరా అయినట్టు అవి చెబుతున్నాయి. దీనికి ప్రతిగా ప్యాంగ్యాంగ్కు 9,000 కంటైనర్లలో ఆహార పదార్థాలను మాస్కో సరఫరా చేసినట్లు తెలుస్తోంది. వీటితో ఆ దేశంలో ధరలను అదుపు చేసినట్లు సమాచారం. ఇటీవలే కిమ్-పుతిన్ స్నేహం మరోసారి ప్రపంచానికి తెలిసింది. వ్యక్తిగతంగా ఉ.కొరియా అధినేతకు వాహనాలంటే చాలా ఇష్టం. ఆయన వద్ద అత్యంత విలాసవంతమైన కార్లు చాలా ఉన్నాయి. సెప్టెంబర్లో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్ కారు ఆరస్ సెనేట్ లిమోసిన్ను కిమ్ ఆసక్తిగా పరిశీలించారు. దీన్ని గమనించిన పుతిన్ ఆయన్ని కారులో ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత అదే కారును ఆయనకు బహుమతిగా పంపారు. కిమ్ దగ్గర మెర్సిడెస్, రోల్స్ రాయిస్ వంటి పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి వీటిని ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐరాస నిషేధం విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. -
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ హెచ్చరిక
అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ సుప్రీం నేత అల్ ఖమేని సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడబోదని పేర్కొన్నాడు. -
సంక్షిప్త వార్తలు (6)
ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో బ్రేకులు సరిగా పనిచేయక ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 53 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. -
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.