ప్రపంచంలో ఊబకాయులు 100 కోట్లు
ప్రతిష్ఠాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన విస్తృత అధ్యయనం ఊబకాయ సమస్యపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటినట్లు పేర్కొంది.
2022లో భారత్లో 1.25 కోట్ల మంది చిన్నారులకుఅధిక బరువు సమస్య
లాన్సెట్ అధ్యయనం వెల్లడి
దిల్లీ: ప్రతిష్ఠాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన విస్తృత అధ్యయనం ఊబకాయ సమస్యపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటినట్లు పేర్కొంది. వీరిలో 15.9 కోట్ల మంది చిన్నారులు, కౌమార వయస్కులు కాగా.. 87.9 కోట్ల మంది పెద్దలు ఉన్నట్లు పేర్కొంది. భారత్లో 2022లో ఊబకాయం బారినపడిన బాలలు(5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు) 1.25 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడించింది. వారిలో 73 లక్షల మంది బాలురు, 52 లక్షల మంది బాలికలు ఉన్నట్లు పేర్కొంది. సాధారణంగా పోషకాహార లోపం అనేది.. తక్కువ బరువు లేదా ఊబకాయానికి దారితీస్తుంది. అయితే, 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం తెలిపింది. దీంతో చాలా దేశాల్లో పోషకాహార లోపంతో ఊబకాయం సమస్య పెరుగుతోందని వెల్లడించింది.
నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయ సమస్య
1990 నాటితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధితుల సంఖ్య నాలుగురెట్లు పెరిగిందని అధ్యయనం తెలిపింది. ఈ సర్వే కోసం 190 దేశాల నుంచి దాదాపు 22 కోట్ల మంది బరువు, ఎత్తులను పరిశోధకులు అధ్యయనం చేశారు. వారిలో 5-19 ఏళ్లవారు 6.3 కోట్లు, 20 ఏళ్లకు పైబడిన వారు 15.8 కోట్ల మంది ఉన్నారు.
- 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ రేటు మహిళల్లో రెట్టింపు కాగా, పురుషుల్లో మూడు రెట్లు పెరిగింది. బాలికల్లో అది 0.1 శాతం నుంచి 3.1 శాతానికి పెరగగా, బాలురలో 0.1 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది.
- 33 ఏళ్ల వ్యవధిలో ఊబకాయ రేటు బాలురు, బాలికల్లో నాలుగు రెట్ల కన్నా ఎక్కువగా పెరిగింది.
- 2022లో ఊబకాయం బారినపడిన చిన్నారులు, కౌమార వయస్కుల సంఖ్య దాదాపు 16 కోట్లు(1990లో 3.1 కోట్లు). వారిలో 6.5 కోట్ల మంది బాలికలు కాగా, 9.4 కోట్ల మంది బాలురు.
- భారత్లో మహిళల్లో ఊబకాయ రేటు 1990 నాటితో పోలిస్తే 1.2 శాతం నుంచి 9.8 శాతానికి పెరిగింది. పురుషుల్లో 0.5 శాతం నుంచి 5.4 శాతానికి ఎగబాకింది. 2022 నాటికి సుమారు 4.4 కోట్ల మంది మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులకు ఊబకాయం ఉంది.
చిన్నారుల్లోనూ ఊబకాయం ఆందోళనకరం
గతంలో ఊబకాయం పెద్దవాళ్లలో మాత్రమే కన్పించేదని, కానీ ఇప్పుడు పాఠశాలకు వెళ్లే చిన్నారులు, టీనేజర్లనూ ఈ సమస్య వేధిస్తుండం తీవ్ర ఆందోళనకరమని ఈ అధ్యయనంలో పాల్గొన్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ నిపుణురాలు గుహ ప్రదీప పేర్కొన్నారు. ‘‘పేద దేశాల్లో కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వాతావరణ మార్పులు, కొవిడ్-19 ఆటంకాలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పేదరికం పెరిగింది. పోషకాహార ధరలూ పెరిగాయి. ఫలితంగా చాలా మందికి నాణ్యమైన ఆహారం లభించక ఊబకాయం బారిన పడ్డారు’’ అని ఆమె చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు