సంక్షిప్త వార్తలు (4)
ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో మంగళవారం హృదయ విదారక ఘటన జరిగింది. వాన్టా నగరంలోని వియెర్టోలా పాఠశాలలో 12 ఏళ్ల విద్యార్థి లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఫిన్లాండ్లో 12ఏళ్ల విద్యార్థి కాల్పులు
ఓ విద్యార్థి మృతి.. మరో ఇద్దరికి గాయాలు
హెల్సింకీ: ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో మంగళవారం హృదయ విదారక ఘటన జరిగింది. వాన్టా నగరంలోని వియెర్టోలా పాఠశాలలో 12 ఏళ్ల విద్యార్థి లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వియెర్టోలా పాఠశాలలో దాదాపు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పులపై వేగంగా స్పందించిన పోలీసులు, నిందితుడిని హెల్సింకీలో అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీ నిందితుడి బంధువుదని, లీగల్లీ రిజిస్టర్ అయిందని పేర్కొన్నారు. కాగా, కాల్పులకు గల కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఫిన్లాండ్ చట్టాల ప్రకారం శిక్షకు కనీస వయస్సు 15 సంవత్సరాలు కావడం వల్ల నిందితుడిని అధికారికంగా అరెస్టు చేయడం సాధ్యం కాదు. ఈ కేసును ఫిన్లాండ్ శిశు సంరక్షణ విభాగం విచారిస్తుంది.
కోర్టుకు ట్రంప్ రూ. 1,460 కోట్ల బాండ్
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆస్తుల విలువను ఎక్కువగా చూపి బ్యాంకుల నుంచి వందల కోట్ల డాలర్ల రుణాలను అక్రమంగా పొందారనే కేసు కీలక మలుపు తిరిగింది. ఈ సివిల్ మోసం కేసులో ట్రంప్ 45.4 కోట్ల డాలర్ల బాండును సమర్పించాలని అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ కేసు పెట్టారు. లేదంటే ఆయన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి బాండ్ మొత్తాన్ని తగ్గించాలని న్యూయార్క్ అప్పిలేట్ కోర్టును ట్రంప్ అభ్యర్థించగా, కోర్టు దాన్ని 17.5 కోట్ల డాలర్లకు తగ్గించింది. 10 రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తుల జప్తు తప్పదని హెచ్చరించింది. దాంతో ట్రంప్ సోమవారం నాడు ఆ బాండ్ సమర్పించారు. ఒకవేళ కేసులో ట్రంప్ ఓడిపోతే మొత్తం 45.4 కోట్ల డాలర్లను రోజువారీ వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ట్రంపే నెగ్గితే ఆయన ఎలాంటి మొత్తాన్నీ చెల్లించనక్కర్లేదు. ఇప్పుడు కట్టిన మొత్తం తిరిగివచ్చేస్తుంది.
పాకిస్థాన్ సెనెట్ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ కూటమి ఘన విజయం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేతృత్వంలోని అధికార కూటమి ఆ దేశ సెనెట్ (ఎగువ సభ) ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మొత్తం 48 సీట్ల భర్తీకి ఎన్నికల ప్రక్రియ చేపట్టగా మంగళవారం రాత్రి 19 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 18 స్థానాలను పీఎంఎల్-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లతో కూడిన కూటమి సొంతం చేసుకుంది. మరో స్థానంలోనూ ఈ కూటమి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మరో 18 స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 11 స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తం 90 మంది ఉన్న సెనెట్లో తాజా ఫలితాలతో కలిపి పీఎంఎల్-ఎన్ బలం 19కి, పీపీపీ బలం 24కి చేరింది. ఇమ్రాన్కు చెందిన పీటీఐకి 20 మంది సభ్యులున్నారు.
కాంగో తొలి మహిళా ప్రధానిగా జుడిత్
కిన్షాసా (కాంగో): ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వ నియమితులయ్యారు. గతంలో ఆమె ప్రణాళికా శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి నిర్ణయం తీసుకున్నారు. రువాండా దేశంతో సరిహద్దును పంచుకుంటున్న కాంగో తూర్పు ప్రాంతంలో ఖనిజ సంపద అధికం. దీనికోసం గతకొన్నేళ్లుగా రెండు దేశాల్లో హింస చెలరేగుతూనే ఉంది. ఈ హింస కారణంగా ఇప్పటివరకు 70లక్షల మంది నిరాశ్రయులయ్యారని, ప్రపంచంలోనే తీవ్ర మానవతా సంక్షోభంగా ఇది నిలిచిందని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. ఈ సమయంలో ప్రధానిగా మహిళా నాయకురాలు బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు