వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న ఆరు జన్యువులు
మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆరు జన్యువులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తాజా పరిశోధన తేల్చింది. భావోద్వేగ స్పందన వంటివాటిలో ఇవి ముఖ్య భూమిక వహిస్తాయని, తద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం, పనితీరు, దార్శనికత వంటివాటిని నిర్ధారిస్తాయని వెల్లడైంది.
గుర్తించిన శాస్త్రవేత్తలు
దిల్లీ: మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆరు జన్యువులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తాజా పరిశోధన తేల్చింది. భావోద్వేగ స్పందన వంటివాటిలో ఇవి ముఖ్య భూమిక వహిస్తాయని, తద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం, పనితీరు, దార్శనికత వంటివాటిని నిర్ధారిస్తాయని వెల్లడైంది. ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానవుడి వరకూ.. పరిణామక్రమంలో మార్పులకు లోనుకాకుండా ఈ జన్యువులు చాలా భద్రంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి మీద జీవుల వ్యవహారశైలి నిర్ధారణలో అవి కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు.
పరిశీలనయోగ్యమైన లక్షణాలు, వ్యవహారశైలిగా జన్యువులు మారుతుంటాయి. దీన్ని జన్యు వ్యక్తీకరణగా పిలుస్తారు. ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది పరిశీలించేందుకు స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నేతృత్వంలో అంతర్జాతీయ బృందం పరిశోధన నిర్వహించింది. ఇందులో భాగంగా గత నాలుగు దశాబ్దాల్లో ఫిన్లాండ్లోని 459 మందికి సంబంధించి సేకరించిన డేటాను కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో విశ్లేషించారు. ఆయా వ్యక్తుల ఆరోగ్యం, శారీరక స్థితి, జీవనశైలితో పాటు వ్యక్తిత్వంతో ముడిపడిన అలవాట్లు, భావోద్వేగ స్పందన, లక్ష్యాలు, విలువలు వంటి వివరాలను సేకరించారు. వ్యక్తిత్వం ఆధారంగా జన్యువుల వ్యక్తీకరణ, సమూహంగా ఏర్పడటం వంటివి జరుగుతున్నట్లు ఇందులో గుర్తించారు. మెదడులోని నిర్దిష్ట ప్రాంతాల్లో 4వేల జన్యువుల వ్యక్తీకరణతో కూడిన నెట్వర్క్ను వారు గమనించారు. వారసత్వంగా మానవ వ్యక్తిత్వం సంక్రమించడానికి వీటిలో కొన్ని కారణమవుతున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇవి కొన్ని సమూహాలుగా ఏర్పడుతున్నాయని, తద్వారా పలు మాడ్యూళ్లుగా రూపాంతరం చెందుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి జన్యువ్యక్తీకరణను నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేలా చేస్తున్నాయని గుర్తించారు. ఈ మాడ్యూళ్లు సులువుగా ఆన్, ఆఫ్ అవుతున్నాయని, తద్వారా మనం రోజువారీ ఎదుర్కొనే సవాళ్లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు వివరించారు. భావోద్వేగాలు, ఆ మాడ్యూళ్ల కట్టడి బాధ్యతను ఆరు జన్యువులతో తయారైన ఒక నియంత్రణ కేంద్రం చూస్తోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?