ప్రతీకారం తప్పదన్న ఇరాన్
సిరియా రాజధాని డమాస్కస్లోని తమ రాయబార కార్యాలయంపై దాడి- ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపించింది. ఎఫ్-35 యుద్ధ విమానాలతో దీనికి పాల్పడినట్లు పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడిలో కమాండర్ల మృతిపై ఆగ్రహం
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత
టెహ్రాన్: సిరియా రాజధాని డమాస్కస్లోని తమ రాయబార కార్యాలయంపై దాడి- ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపించింది. ఎఫ్-35 యుద్ధ విమానాలతో దీనికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ నేరానికి వారు పశ్చాత్తాపపడేలా చేస్తామని ఇరాన్ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖొమేనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ప్రతీకార ప్రతిస్పందన తప్పదని డమాస్కస్లోని ఇరాన్ రాయబారి హుస్సేన్ అక్బరీ హెచ్చరించారు. ఒక అధికారిక భవనంపై ఇజ్రాయెల్ దాడి చేయడం బహుశా ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ప్రతీకార దాడి ఎప్పుడు? ఎలా? ఎంత తీవ్రతతో చేపట్టాలనేది త్వరలో నిర్ణయిస్తామని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నాజిర్ కనానీ హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఐరాస భద్రతామండలిని సమావేశపరచాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
సోమవారంనాటి దాడిలో మొత్తం ఎనిమిదిమంది మృతి చెందినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ధ్రువీకరించింది. సీనియర్ కమాండర్లు- మొహమ్మద్ రెజా జహేదీ, మొహమ్మద్ హదీ రహీమీ కూడా మృతుల్లో ఉన్నట్లు వెల్లడించింది. జహేదీ ఇరాన్కు సైనిక సలహాదారుగా వ్యవహరిస్తుండగా, ఖుద్స్ దళాలకు సమన్వయకర్తగా రహీమీ పనిచేస్తున్నారు. దాడిపై ఇజ్రాయెల్ ఆచితూచి స్పందించింది. ధ్వంసమైన భవనం రాయబార కార్యాలయం కాదని, అది ఖుద్స్ దళాలకు కేంద్రంగా ఉందని సైనిక అధికార ప్రతినిధి డేనియల్ హగారీ అన్నారు. దాడిని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ ఖండించాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో వెంటనే కాల్పుల విరమణకు ఐరాసలో కొత్తగా తీర్మానాన్ని ఫ్రాన్స్ ప్రతిపాదించింది. యుద్ధ విరమణకు ప్రత్యామ్నాయ మార్గాలపై అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నత వర్గాలు రెండున్నర గంటలసేపు వర్చువల్గా చర్చించుకున్నాయి.
దాడిలో ఏడుగురి మృతి.. ఆహార సాయం నిలిపివేత
యుద్ధం కారణంగా ఆకలితో అల్లాడుతోన్న గాజావాసుల పాలిట ఇజ్రాయెల్ దుందుడుకు చర్య శాపంగా మారింది. ఆ దేశం జరిపిన గగనతల దాడిలో ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ (డబ్ల్యూసీకే) స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సహాయకులు, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గాజాకు సముద్ర మార్గం ద్వారా వేల టన్నుల ఆహారాన్ని చేరవేస్తోన్న ఈ సంస్థ.. తాజా పరిణామంతో తక్షణం తమ సహాయ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఘటనపై ఇజ్రాయెల్ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. స్వతంత్ర దర్యాప్తు చేపడతామని తెలిపింది. ఇది ఉద్దేశపూర్వక దాడి కాదని ప్రధాని నెతన్యాహు చెప్పారు. మృతుల్లో ముగ్గురు బ్రిటన్వాసులతోపాటు ఆస్ట్రేలియా, పోలండ్, అమెరికా- కెనడాకు చెందిన వారున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దాడిపై ఇజ్రాయెల్ నుంచి వివరణ కోరినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ చెప్పారు. దాదాపు 400 టన్నుల సామగ్రితో గాజా తీరానికి చేరుకున్న మూడు నౌకలు వెనక్కి వచ్చేస్తున్నట్లు సైప్రస్ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్