తైవాన్ను కుదిపేసిన భూకంపం
భారీ భూకంపం తైవాన్ను బుధవారం కుదిపేసింది. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం వ్యాప్తంగా పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి.
9 మంది మృత్యువాత
1011 మందికి గాయాలు
హువాలీన్: భారీ భూకంపం తైవాన్ను బుధవారం కుదిపేసింది. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం వ్యాప్తంగా పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. వంతెనలు కొన్ని సెకన్లపాటు అటూఇటూ ఊగాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి తైవాన్ వ్యాప్తంగా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. 1,011 మంది గాయపడ్డారు. ఒక దశలో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయినా.. తర్వాత వాటిని ఉపసంహరించారు. గత పాతికేళ్లలో తైవాన్ను వణికించిన అత్యంత భారీ భూకంపం ఇదేనని తెలుస్తోంది. తూర్పు తీరంలోని హువాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి దాదాపు 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాని తీవ్రత రిక్టరు స్కేలుపై 7.2గా నమోదైందని తైవాన్ భూకంప పర్యవేక్షణ సంస్థ తెలిపింది. అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం 7.4గా పేర్కొంది. తాజా విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు భారత ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు.
భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో తైవాన్ ఉంది. అక్కడి ప్రజలు ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటుంటారు. అయితే బుధవారం స్వల్ప ప్రకంపనలు వస్తాయని అధికారులు అంచనా వేయగా, ఉదయం 7:58 నిమిషాలకు చాలా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ధాటికి హువాలీన్ కౌంటీలో చాలా భవనాలు నేలకూలాయి. గ్రౌండ్ ఫ్లోర్లు కూలిపోవడంతో కొన్ని బహుళ అంతస్తుల భవనాలు పక్కకు ఒరిగాయి.
ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కూలిన భవనాల శిథిలాల నుంచి పలువురిని స్థానికులు, సహాయక సిబ్బంది బయటకు తీస్తుండటం చాలాచోట్ల కనిపించింది. హువాలీన్కు 150కిపైగా కిలోమీటర్ల దూరంలోని తైపీ (తైవాన్ రాజధాని)లో పాత భవనాల నుంచి టైల్స్ ఊడిపోయాయి. అనేక పాఠశాలల నుంచి విద్యార్థులను మైదానాలకు తరలించారు. రైలు సేవలు నిలిచిపోయాయి. 25 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందు నిర్మించిన జాతీయ అసెంబ్లీ భవనం, తావోయువాన్లోని ప్రధాన విమానాశ్రయం కొంత దెబ్బతిన్నాయి. ఒక క్వారీలో 64 మంది, మరో క్వారీలో ఆరుగురు చిక్కుకొని ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఫోన్ నెట్వర్కులు పనిచేయకపోవడంతో.. హువాలీన్లోని తరోకో నేషనల్ పార్కులో మినీబస్సుల్లోని 50 మంది జాడ తెలియరాలేదని అధికారులు తెలిపారు. యొనగుని తీరంలో 30 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. అయితే మధ్యాహ్నంకల్లా సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. మరోవైపు- చైనాలో షాంఘై సహా ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్సుల్లోనూ భూమి కంపించింది. 1999 సెప్టెంబరు 21న తైవాన్ను భారీ భూకంపం (7.7 తీవ్రత) వణికించింది. నాటి విపత్తు ధాటికి 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు లక్ష మంది గాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.