అక్షయపాత్ర కృషి గర్వకారణం: మోదీ
‘‘అక్షయపాత్ర కృషి ఎంతో గర్వకారణం, ఇది ఆనందదాయక క్షణం. 2019 ఫిబ్రవరిలో బృందావన్ వద్ద 300వ కోట్ల భోజనాన్ని నా చేతుల మీదుగా వడ్డించాను.
400 కోట్లమందికి అన్నదానంపై ఐరాసలో ప్రత్యేక వేడుక
ఐక్యరాజ్య సమితి: ‘‘అక్షయపాత్ర కృషి ఎంతో గర్వకారణం, ఇది ఆనందదాయక క్షణం. 2019 ఫిబ్రవరిలో బృందావన్ వద్ద 300వ కోట్ల భోజనాన్ని నా చేతుల మీదుగా వడ్డించాను. కోట్లాది బాలలకు ఆహారాన్ని అందించడం ద్వారా అక్షయపాత్ర భావితరాలకు పోషణను సమకూరుస్తోంది’’ అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రముఖ స్వచ్ఛందసంస్థ ‘అక్షయపాత్ర ఫౌండేషన్’ 400వ కోట్ల భోజనాన్ని వడ్డించిన సందర్భంగా మంగళవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ‘ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి సాధనలో భారత్ విజయాలు’ అనే శీర్షికన దీన్ని నిర్వహించారు. 400వ కోట్ల భోజనాన్ని సమితి ప్రధాన కార్యాలయంలో వడ్డించిన అక్షయపాత్ర ఫౌండేషన్ను అభినందిస్తూ ప్రధాని మోదీ పంపిన సందేశాన్ని సమితిలో భారత శాశ్వత కార్యాలయ ప్రతినిధి రుచిరా కాంబోజ్ చదివి వినిపించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాలుగోదైన ఆకలి నిర్మూలనను సాధించడంలో భారత్ కృషికి ఇది నిదర్శనమని కాంబోజ్ పేర్కొన్నారు.
సమితి కార్యక్రమంలో జరిగిన ఈ వేడుకకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి, అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు మధు పండిత్ దాస హాజరయ్యారు. 400 కోట్ల మందికి భోజనాన్ని వడ్డించడం సాధారణ విషయం కాదని సత్యార్థి కీలకోపన్యాసంలో ప్రశంసించారు. ప్రపంచం 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో విఫలమైతే తన భవిష్యత్తును కోల్పోయినట్లే అన్నారు. భారత ప్రభుత్వం, అక్షయపాత్ర కలిసి భవిష్యత్తుపై ఆశ కోల్పోవద్దని మానవాళికి చాటుతున్నాయన్నారు. తమ తమ దేశాల్లోని పేదపిల్లల కోసం అక్షయపాత్ర వంటి కార్యక్రమాలను చేపట్టాలని నారాయణమూర్తి సమితి సభ్యులను కోరారు. ఇది ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య కార్యక్రమమనీ, శుభ్రమైన ఆహారాన్ని వేగంగా వేడిగా పంపిణీ చేయడానికి అక్షయపాత్ర అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోందని చెప్పారు.
భారీఎత్తున వంట, ఆహార పంపిణీకి తాము ఉపయోగిస్తున్న అధునాతన పరిజ్ఞానాన్నీ, అనుభవాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలు, సంస్థలతో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్షయపాత్ర చైర్మన్ మధుపండిత్ దాస చెప్పారు. తుర్కియే భూకంపంలోనూ, ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఆర్తులకు అన్నపానాదులు అందిస్తున్నామని వివరించారు. భారత్లో అక్షయపాత్ర 72 వంటశాలలను నిర్వహిస్తోందని, గత 24 ఏళ్లలో 24,000 పాఠశాలల్లోని 21 లక్షల మందికి రోజూ భోజనం అందిస్తున్నట్లు దాస చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.