సంక్షిప్త వార్తలు (3)
తైవాన్కు ఆయుధాలు సమకూరుస్తున్నారని ఆరోపిస్తూ రెండు అమెరికా రక్షణ కంపెనీలపై చైనా గురువారం ఆంక్షలు విధించింది.
రెండు అమెరికా రక్షణ కంపెనీలపై చైనా ఆంక్షలు
బీజింగ్: తైవాన్కు ఆయుధాలు సమకూరుస్తున్నారని ఆరోపిస్తూ రెండు అమెరికా రక్షణ కంపెనీలపై చైనా గురువారం ఆంక్షలు విధించింది. జనరల్ అటామిక్స్ ఎరోనాటికల్ సిస్టమ్స్, జనరల్ డైనమిక్ ల్యాండ్ సిస్టమ్స్ అనే రెండు అమెరికా కంపెనీలకు చైనాలో ఉన్న ఆస్తులపై ఆంక్షలు విధించామని తెలిపింది. ‘‘నిరంతరంగా తైవాన్కు కొనసాగుతున్న అమెరికా ఆయుధాల సరఫరా ‘ఒక చైనా’ సూత్రాన్ని, మూడు చైనా-అమెరికాల ఉమ్మడి నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి. దేశ అంతర్గత వ్యవహారాలº్ల జోక్యం చేసుకోవడం మా సార్వభౌమ అధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయడమే’ అని బీజింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తైవాన్ ద్వీపం చైనాలో అంతర్భాగమేనని మరోసారి నొక్కి చెప్పింది. అవసరమైతే ద్వీపాన్ని బలవంతంగానైనా సొంతం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. చైనా ఆంక్షలపై రెండు సంస్థలు వెంటనే స్పందించలేదు. మరోవైపు తైవాన్ చుట్టూ 14 యుద్ధనౌకలు, ఆరు నౌకలను బుధ, గురువారాల్లో మోహరింపజేసి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. తైవాన్ గగనతల రక్షణ జోన్లోకి ఆరు విమానాలను పంపి ద్వీప రక్షణ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించింది.
వాషింగ్టన్లో దుండగుల కాల్పులు
ఒకరి మృతి, అయిదుగురికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఆ దేశ రాజధాని వాషింగ్టన్లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో 9, 12 ఏళ్ల పిల్లలతో పాటు ఓ మహిళా కూడా ఉన్నారు. బుధవారం సాయంత్రం కార్వర్ లాంగ్స్టన్ ప్రాంతానికి వాహనంలో వచ్చిన అనుమానితులు వీధిలోని ప్రజలపై ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
లోయలో పడిన బస్సు.. పాక్లో 17మంది యాత్రికుల దుర్మరణం
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో బస్సు లోయలో పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముస్లిం యాత్రికుల బృందంతో ఓ బస్సు తట్ట ప్రాంతం నుంచి బయలుదేరింది. వీరంతా ఈదుల్ ఫితర్ను పురస్కరించుకొని బలూచిస్థాన్ ప్రావిన్స్ ఖుజ్దార్ జిల్లాలోని సూఫీ పుణ్యక్షేత్రమైన షా నూరానీకి వెళుతున్నారు. రాత్రి 8 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు సింధ్-బలూచిస్థాన్ ప్రావిన్సుల సరిహద్దు పట్టణ సమీపంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణను కోల్పోవడంతో ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి