భారత్‌తో సుస్థిర సంబంధాలు ఇరుదేశాలకు మేలు: చైనా

చైనా-భారత్‌ల మధ్య బలమైన, సుస్థిర సత్సంబంధాలు ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు చేస్తాయని చైనా గురువారం పేర్కొంది.

Updated : 12 Apr 2024 05:57 IST

బీజింగ్‌: చైనా-భారత్‌ల మధ్య బలమైన, సుస్థిర సత్సంబంధాలు ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు చేస్తాయని చైనా గురువారం పేర్కొంది. సరిహద్దు సమస్య అనేది రెండింటి మధ్య ఉన్న పూర్తి సంబంధాలను ప్రతిబింబించదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ పేర్కొన్నారు. భారత్‌, చైనాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికీ కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ న్యూస్‌ వీక్‌ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో బీజింగ్‌ పై మేరకు స్పందించింది.  ‘‘ప్రధాని మోదీ వ్యాఖ్యలను గుర్తించాం. ఇరుదేశాల మధ్య మంచి, స్థిరమైన సంబంధాలు.. ఉమ్మడి ప్రయోజనాలకు, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా శాంతిస్థాపన, అభివృద్ధికి దోహదపడతాయి. సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించుకోవాలి. దౌత్య, సైనిక మార్గాల్లో ఇరుపక్షాలు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాయి. వ్యూహాత్మక, దీర్ఘకాలిక కోణంలో ద్వైపాక్షిక సంబంధాల నిర్వహణ, పరస్పర విశ్వాసం, సహకారం, సంప్రదింపులు, విభేదాల పరిష్కారం విషయంలో మాతో భారత్‌ కలిసివస్తుందని ఆశిస్తున్నాం’’ అని మావో నింగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని