ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలతో పెరుగుతున్న పక్షవాత మరణాలు
వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతల్లో వస్తున్న వైరుధ్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షవాత బాధితులు ఎక్కువగా చనిపోతున్నారని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు.
దిల్లీ: వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతల్లో వస్తున్న వైరుధ్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షవాత బాధితులు ఎక్కువగా చనిపోతున్నారని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. మూడు దశాబ్దాల అంతర్జాతీయ డేటాపై తాజాగా జరిగిన విశ్లేషణలో ఈ మేరకు వెల్లడైందని వారు తెలిపారు. ఉష్ణోగ్రతల్లో నాటకీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న మార్పులు మానవ ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనకు నాయకత్వం వహించిన క్వాన్ చెంగ్ తెలిపారు. అవి ఆమోదయోగ్య స్థాయికి మించి పెరిగినా, తగ్గినా పక్షవాత బాధితులకు ఇబ్బందేనని చెప్పారు. వీరి అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం..
- 2019లో భరింపశక్యం కాని ఉష్ణోగ్రతలతో 5.2 లక్షల మంది పక్షవాత బాధితులు మరణించారు. వీరిలో 4.7 లక్షల మంది.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్లే బలయ్యారు.
- 1990తో పోలిస్తే.. అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవించిన పక్షవాత మరణాలు పెరిగాయి.
- అధిక ఉష్ణోగ్రతలతో పక్షవాత బాధితులపై పడుతున్న భారం బాగా పెరిగింది. సామాజిక-జనాభా సూచీ తక్కువగా ఉన్న ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువ.
- 2019లో భారత్లో భరింపశక్యం కాని ఉష్ణోగ్రతల వల్ల 33వేల మంది చనిపోయారు. అందులో 55 శాతం మరణాలకు తీవ్ర వేడే కారణం. ఉష్ణోగ్రతలు పడిపోవడంవల్ల 45 శాతం మంది మృత్యువాత పడ్డారు.
- జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం కూడా ఈ తరహా మరణాలు అధికం కావడానికి కారణమవుతోంది.
- ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాల వల్ల చనిపోతున్న పక్షవాత బాధితుల్లో పురుషులే ఎక్కువ. సగటున లక్ష మందిలో 7.7 మంది మగవారు ఇలా బలవుతున్నారు. మహిళల్లో ఇది 5.9గానే ఉంది.
- ప్రాంతీయంగా చూసినప్పుడు మధ్య ఆసియాలో ఈ తరహా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. అక్కడ సగటున లక్ష మందిలో 18 మంది ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు