ఏ క్షణంలోనైనా..!
ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయనుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్ అవీవ్పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం కలకలం రేపుతోంది.
ఇజ్రాయెల్పై 100 డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో దాడికి ఇరాన్ సమాయత్తం
ఎదుర్కొనేందుకు సిద్ధమైన నెతన్యాహు సేన
పశ్చిమాసియాలో క్షణక్షణం భయాందోళనలు
టెహ్రాన్/టెల్ అవీవ్: ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయనుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్ అవీవ్పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం కలకలం రేపుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ప్రధాని నెతన్యాహుకు అగ్రరాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. కుటుంబాలతో సహా ఫ్రెంచ్ దౌత్యవేత్తలు తక్షణం టెహ్రాన్ను వీడాలని ఫ్రాన్స్ ఆదేశించింది. భారత పౌరులెవ్వరూ ఇజ్రాయెల్, ఇరాన్కు ప్రయాణాలు చేయొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. శనివారం వరకు టెహ్రాన్కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ గడువును గురువారానికి పొడిగించింది. రెండు వారాల క్రితం సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై దాడిలో రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన కీలక సైనికాధికారులు మృతి చెందినప్పటి నుంచి ఇరాన్ ఆగ్రహంతో రగులుతోంది. ఇజ్రాయల్పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది. అయితే దాడిపై ఇంకా ఇరాన్ తుది నిర్ణయం తీసుకోలేదన్న వార్తలూ వెలువడుతున్నాయి. మరోవైపు ఇరాన్ను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షిపణి విధ్వంసక యుద్ధనౌకలను ఇజ్రాయెల్కు సమీపంలోకి అగ్రరాజ్యం పంపింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లా శుక్రవారం ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఆ దేశ రక్షణ మంత్రి యోయావ్ గాలాంట్తో కలిసి హెట్జోర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ‘‘ఇజ్రాయెల్, అమెరికాలను ఓడించగలమని మా శత్రువులు భావిస్తున్నారు.కానీ జరిగేది అందుకు వ్యతిరేకం. వారు మమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తున్నారు. మా బంధాన్ని బలోపేతం చేస్తున్నారు’’ అని ఎరిక్తో సమావేశానంతరం యోయావ్ గలాంట్ వ్యాఖ్యానించారు.
మేం సహకరించం
ఇజ్రాయెల్కు అండగా ఇరాన్పై అమెరికా దాడి చేస్తే తాము సహకరించబోమని కొన్ని అరబ్ దేశాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఖతార్, కువైట్ ఈ విషయాన్ని కరాఖండిగా అగ్రరాజ్యానికి తేల్చి చెప్పాయి. ఇరాన్పై దాడికి తమ దేశ గగనతలాన్ని గానీ.. స్థావరాలను గానీ.. వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టంచేశాయి. సౌదీ అరేబియా సహా మిగతా అరబ్ దేశాలూ అదే బాట పట్టే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్, ఇరాన్కు వెళ్లొద్దు
భారత పౌరులకు విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరిక
దిల్లీ: పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఇరాన్, ఇజ్రాయెల్కు ప్రయాణాలు చేయొద్దని భారత పౌరులను శుక్రవారం విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. ఇరాన్, ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత మేరకు ప్రయాణాలను నియంత్రించుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో 4 వేల మంది, ఇజ్రాయెల్లో దాదాపు 18,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో పనిచేసేందుకు భారత్ నుంచి వెళుతున్న కార్మికులకు అనుమతులు లభించవని తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలలో ఇజ్రాయెల్కు 6 వేల మంది నిర్మాణ కార్మికులు వెళ్లాల్సి ఉంది. మరోవైపు బ్రిటన్ కూడా తమ పౌరులు తక్షణం ఇజ్రాయెల్ వీడాలని సూచించింది. ఇరాన్, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాలకు ఫ్రెంచ్ పౌరులెవరూ వెళ్లొద్దని ఫ్రాన్స్ అడ్వయిజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని ఫ్రెంచ్ దౌత్యవేత్తలు కూడా కుటుంబాలతో సహా తక్షణం ఇరాన్ను వీడాలని పేర్కొంది. చైనా కూడా ఇజ్రాయెల్లోని తమ పౌరులను అప్రమత్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
సొంత సైన్యంపైనే కాల్పులు జరపడంతో ఐడీఎఫ్కు భారీ నష్టం వాటిల్లింది. పొరపాటున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. -
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
Fraud: అగ్రరాజ్యంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇద్దరు అన్నదమ్ములు కేవలం 12 సెకన్లలోనే రూ.200 కోట్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీని దోచేశారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
Robert Fico: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
Pakistan: భారత్ సాధిస్తున్న పురోగతి.. పాక్ దయనీయ స్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది. -
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. -
యుద్ధంపై చర్చలకు సిద్ధమే
ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఖైదీల వాహనాన్ని కారుతో ఢీకొట్టి..
ఫ్రాన్స్లో మాదకద్రవ్యాల ముఠా బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న వాహనంపై హాలీవుడ్ సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడింది. -
డెంగీకి మరో టీకా!
డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. -
‘మళ్లీ మోదీయే ప్రధాని’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని చేపడతారని పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త సాజిద్ తరార్ పేర్కొన్నారు. -
కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. -
యూఎస్ డిస్ట్రాయర్పై దాడి చేశాం
ఎర్రసముద్రంలో యూఎస్ నేవీ డిస్ట్రాయర్పై, ఓ వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు బుధవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. -
‘చాబహార్’ను సంకుచిత దృష్టితో చూడకూడదు
చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికి మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. -
సంక్షిప్త వార్తలు (3)
మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపస్ రాష్ట్రం చికోముసెలో పట్టణంలో మంగళవారం జరిగిన సామూహిక కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. -
స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై కాల్పులు చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. -
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. -
అధ్యక్ష చర్చలకు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం సిద్ధమేనని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో భారీ వర్షంతో పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు