ఏ క్షణంలోనైనా..!
ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయనుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్ అవీవ్పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం కలకలం రేపుతోంది.
ఇజ్రాయెల్పై 100 డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో దాడికి ఇరాన్ సమాయత్తం
ఎదుర్కొనేందుకు సిద్ధమైన నెతన్యాహు సేన
పశ్చిమాసియాలో క్షణక్షణం భయాందోళనలు
టెహ్రాన్/టెల్ అవీవ్: ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయనుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్ అవీవ్పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం కలకలం రేపుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ప్రధాని నెతన్యాహుకు అగ్రరాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. కుటుంబాలతో సహా ఫ్రెంచ్ దౌత్యవేత్తలు తక్షణం టెహ్రాన్ను వీడాలని ఫ్రాన్స్ ఆదేశించింది. భారత పౌరులెవ్వరూ ఇజ్రాయెల్, ఇరాన్కు ప్రయాణాలు చేయొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. శనివారం వరకు టెహ్రాన్కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ గడువును గురువారానికి పొడిగించింది. రెండు వారాల క్రితం సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై దాడిలో రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన కీలక సైనికాధికారులు మృతి చెందినప్పటి నుంచి ఇరాన్ ఆగ్రహంతో రగులుతోంది. ఇజ్రాయల్పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది. అయితే దాడిపై ఇంకా ఇరాన్ తుది నిర్ణయం తీసుకోలేదన్న వార్తలూ వెలువడుతున్నాయి. మరోవైపు ఇరాన్ను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షిపణి విధ్వంసక యుద్ధనౌకలను ఇజ్రాయెల్కు సమీపంలోకి అగ్రరాజ్యం పంపింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లా శుక్రవారం ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఆ దేశ రక్షణ మంత్రి యోయావ్ గాలాంట్తో కలిసి హెట్జోర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ‘‘ఇజ్రాయెల్, అమెరికాలను ఓడించగలమని మా శత్రువులు భావిస్తున్నారు.కానీ జరిగేది అందుకు వ్యతిరేకం. వారు మమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తున్నారు. మా బంధాన్ని బలోపేతం చేస్తున్నారు’’ అని ఎరిక్తో సమావేశానంతరం యోయావ్ గలాంట్ వ్యాఖ్యానించారు.
మేం సహకరించం
ఇజ్రాయెల్కు అండగా ఇరాన్పై అమెరికా దాడి చేస్తే తాము సహకరించబోమని కొన్ని అరబ్ దేశాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఖతార్, కువైట్ ఈ విషయాన్ని కరాఖండిగా అగ్రరాజ్యానికి తేల్చి చెప్పాయి. ఇరాన్పై దాడికి తమ దేశ గగనతలాన్ని గానీ.. స్థావరాలను గానీ.. వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టంచేశాయి. సౌదీ అరేబియా సహా మిగతా అరబ్ దేశాలూ అదే బాట పట్టే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్, ఇరాన్కు వెళ్లొద్దు
భారత పౌరులకు విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరిక
దిల్లీ: పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఇరాన్, ఇజ్రాయెల్కు ప్రయాణాలు చేయొద్దని భారత పౌరులను శుక్రవారం విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. ఇరాన్, ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత మేరకు ప్రయాణాలను నియంత్రించుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో 4 వేల మంది, ఇజ్రాయెల్లో దాదాపు 18,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో పనిచేసేందుకు భారత్ నుంచి వెళుతున్న కార్మికులకు అనుమతులు లభించవని తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలలో ఇజ్రాయెల్కు 6 వేల మంది నిర్మాణ కార్మికులు వెళ్లాల్సి ఉంది. మరోవైపు బ్రిటన్ కూడా తమ పౌరులు తక్షణం ఇజ్రాయెల్ వీడాలని సూచించింది. ఇరాన్, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాలకు ఫ్రెంచ్ పౌరులెవరూ వెళ్లొద్దని ఫ్రాన్స్ అడ్వయిజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని ఫ్రెంచ్ దౌత్యవేత్తలు కూడా కుటుంబాలతో సహా తక్షణం ఇరాన్ను వీడాలని పేర్కొంది. చైనా కూడా ఇజ్రాయెల్లోని తమ పౌరులను అప్రమత్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి