ఇజ్రాయెలీ కుబేరుడి నౌక హైజాక్
ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో మరో అగ్గిరాజేసే కీలక పరిణామం చోటుచేసుకుంది.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దూకుడు
హెలికాప్టర్లతో వెంబడించి మరీ అధీనంలోకి..
సిబ్బందిలోని 25 మందిలో 17 మంది భారతీయులే
నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా
అమెరికా యుద్ధనౌకల రంగ ప్రవేశం
సర్వసన్నద్ధంగా ఇజ్రాయెల్
దుబాయ్/టెహ్రాన్: ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో మరో అగ్గిరాజేసే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ.. ఇరాన్ దూకుడుగా వ్యవహరించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్ను హెలికాప్టర్లతో వెంబడించి మరీ శనివారం ఇరాన్ తన అధీనంలోకి తీసుకుంది. ఈ ఆపరేషన్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళాల (ఐఆర్జీసీ) ప్రత్యేక కమాండోలు పాల్గొన్నారు. నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 17 మంది భారతీయులే. పోర్చుగీసు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకను హర్మూజ్ జలసంధికి దగ్గరకు రాగానే ఐఆర్జీసీ ప్రత్యేక కమాండోలు చుట్టుముట్టారు. హెలికాప్టర్ నుంచి నౌకపైకి దిగారు. సిబ్బందిని అదుపులోకి తీసుకొని నౌకను తమ ప్రాదేశిక జలాలవైపునకు మళ్లించారు. లండన్ నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇజ్రాయెలీ కుబేరుడు ఇయాల్ ఒఫర్కు చెందిన నౌకగా దీన్ని గుర్తించారు. నౌకను ఇరాన్ నియంత్రణలోకి తీసుకున్న విషయాన్ని బ్రిటన్కు చెందిన యూకే మారిటైమ్ ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడిలో ఐఆర్జీసీకి చెందిన పలువురు సీనియర్ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఇజ్రాయెలే కారణమని, ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రేపో మాపో ఇజ్రాయెల్పై నేరుగా ఆ దేశం దాడి చేస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా ఇజ్రాయెల్ కుబేరుడి నౌకను హైజాక్ చేయడం గమనార్హం.
నౌకలను హైజాక్ చేయడం సముద్రపు దొంగల పని అని.. ఇప్పుడు ఇరాన్ కూడా ఆ దొంగల్లానే వ్యవహరించిందని ఇజ్రాయెల్ మండిపడింది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్కు తాము పూర్తిగా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. అన్నిరకాలుగా టెల్ అవీవ్కు సాయం చేస్తామని.. ఆ దేశ భద్రతకు తాము హామీ అని తెలిపారు. దాడి చేసే సాహసం చేయొద్దని ఇరాన్ను ఆయన హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్కు రక్షణగా యుద్ధ నౌకలను, దళాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించే ప్రక్రియ చేపట్టింది.మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధతను పెంచింది. ఆ దేశ యుద్ధ విమానాలు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇజ్రాయెల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 1000 మందికి మించి ఎక్కడా గుమికూడవద్దని హెచ్చరికలు జారీచేశారు.
ఇరాన్తో మాట్లాడుతున్నాం: భారత్
నౌకలోని 17 మంది భారతీయులను రక్షించడానికి భారత్ రంగంలోకి దిగింది. దౌత్యమార్గాల్లో ఇరాన్తో సంప్రదింపులు ప్రారంభించింది. ఈ మేరకు విదేశీవ్యవహారాల శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
-
ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి