పిల్లలు సూపర్‌ మార్కెట్‌ ఉత్పత్తులు కాదు

సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published : 14 Apr 2024 05:12 IST

సరోగసీపై ఇటలీ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పద్ధతిలో పిల్లలకు జన్మనివ్వడం అమానవీయమని.. వారు సూపర్‌ మార్కెట్‌ ఉత్పత్తులు కారని ఘాటుగా స్పందించారు. ‘‘ఒకరి గర్భాన్ని అద్దెకు తీసుకోవడం స్వేచ్ఛా చర్య అని మీరు నన్ను ఒప్పించలేరు. పిల్లల్ని సూపర్‌ మార్కెట్‌లో ఉత్పత్తిగా పరిగణించడాన్ని ప్రేమ అని మీరు నాకు సర్దిచెప్పలేరు. గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడాన్ని నేను ఇప్పటికీ అమానవీయంగానే భావిస్తాను’’ అని మెలోనీ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిని అంతర్జాతీయ నేరంగా మార్చే బిల్లుకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. సరోగసీ ప్రక్రియ ఇప్పటికే ఇటలీలో శిక్షార్హమైన నేరం. అతివాద భావజాలం కలిగిన అధికార పక్షం ఈ నిబంధలను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం చట్టబద్ధమైన దేశాల్లో కూడా ఇటలీ ప్రజలు పిల్లల్ని కనకుండా ఈ బిల్లు నిషేధించనుంది. అయితే దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని