సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
సొంత బిడ్డను చంపుకొన్న రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. రష్యాలో ఓ ఇన్ఫ్లుయెన్సరు చేసిన ప్రయోగాలకు సొంత బిడ్డే బలి కాగా, కోర్టు అతడికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఏడాది క్రితం జరిగిన ఆ దారుణ ఘటనలో నేరం రుజువు కావటంతో తాజాగా కోర్టు తీర్పు చెప్పింది. మాక్సిమ్ లైయుటీ అనే ఇన్ఫ్లుయెన్సరు పచ్చి కూరగాయలతో ప్రత్యేక డైట్ల గురించి చెబుతూ సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసేవాడు. మనిషి బతకడానికి అసలు ఆహారమే అవసరం లేదని.. కేవలం సూర్యరశ్మితో ఎంతకాలమైనా జీవించవచ్చనేది అతడి భ్రమ. దీన్ని యూజర్లకు చెబుతూ.. నిరూపించటం కోసం నెలల పసికందు అయిన సొంతబిడ్డపై ప్రయోగానికి సిద్ధమయ్యాడు. భార్య ఎంత వారించినా మాక్సిమ్ వినలేదు. ఆ శిశువుకు పాలు పట్టవద్దని హెచ్చరించేవాడు. చిన్నారి ఆరోగ్యం క్షీణిస్తున్నా.. ఎండలో ఉంచితే రోగనిరోధక శక్తి దానంతట అదే పెరిగి కోలుకుంటాడని మొండిగా వాదించేవాడు. తల్లి ఆగలేక ఒక్కోసారి దొంగచాటుగా పాలు పట్టేది. బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇబ్బంది పడుతున్నా వైద్యుల వద్దకు తీసుకువెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. బలహీనంగా ఉన్న చిన్నారిని చన్నీటిలో ముంచేవాడు. దీనివల్ల శరీరం దృఢంగా తయారవుతుందనేవాడు. బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించి శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురవడంతో ఇతరుల ఒత్తిడితో బిడ్డను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి బాబు ప్రాణాలు కోల్పోయాడు. వైద్యపరీక్షల్లో నిమోనియా సహా పలు సమస్యల వల్ల చిన్నారి చనిపోయినట్లు తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు మాక్సిమ్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మాక్సిమ్ ఏదేదో చెప్పి బుకాయించినా.. చిన్నారి తల్లి మాత్రం ఉన్న విషయం చెప్పేసింది. కోర్టు ఆమెకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఏడాది విచారణ తర్వాత మాక్సిమ్ నేరాన్ని అంగీకరించడంతో అతడికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కొసమెరుపు ఏమిటంటే.. అందరికీ పచ్చి కూరగాయలు తినాలని చెప్పిన అతడే కస్టడీలో ఉన్నప్పుడు నూడుల్స్, మాంసం వంటివి కావాలనేవాడని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద