‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్‌ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి.

Published : 19 Apr 2024 07:46 IST

మళ్లీ తడబడ్డ బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్‌ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. బుధవారం పిట్స్‌బర్గ్‌లో అధ్యక్షుడు మాట్లాడుతూ తన మావయ్య సెకండ్‌ లెప్టినెంట్‌ ఆంబ్రోస్‌ జె.ఫినెగన్‌ జూనియర్‌ను పపువా న్యూగినియాలో నరమాంస భక్షకులు తినేశారని పేర్కొన్నారు. 1944లో న్యూగినియా ఉత్తరతీరంలో ఆంబ్రోస్‌ ప్రయాణిస్తున్న విమానం కూలింది. ఆ ఘటనలో ఆంబ్రోస్‌తో పాటు మరో ఇద్దరు చనిపోయారు. మృతదేహాలు లభ్యం కాలేదు. దీనిపై బైడెన్‌ ‘‘న్యూగినియాలో అప్పట్లో నరమాంస భక్షకులు చాలా మంది ఉండేవాళ్లు’’ అని అన్నారు. అమెరికా సైనిక రికార్డులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు