సైబర్‌ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం

సైబర్‌ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్‌ఫర్మేషన్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (ఐఎస్‌ఎఫ్‌) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు.

Published : 20 Apr 2024 05:56 IST

 ఐఎస్‌ఎఫ్‌ను ప్రారంభించిన జిన్‌పింగ్‌

బీజింగ్‌: సైబర్‌ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్‌ఫర్మేషన్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (ఐఎస్‌ఎఫ్‌) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యమైన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి ఇది వ్యూహాత్మకంగానే కాకుండా కీలక స్తంభంగా నిలవనుందని పేర్కొన్నారు. చైనా సైన్యంలో అత్యున్నత కమాండ్‌ అయిన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ (సీఎంసీ) అధిపతిగా, అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) అధినేతగా, చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగే వ్యవహరిస్తున్నారు. ఐఎస్‌ఎఫ్‌ను ఏర్పాటుచేయాలన్న ప్రధాన నిర్ణయాన్ని బలమైన సైన్యాన్ని తయారుచేసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీసీ, సీఎంసీలు తీసుకున్నాయని చెప్పారు. రాజకీయ, సైబర్‌ నేరాలను ఎదుర్కొనేందుకు 2015లో ఏర్పాటు చేసిన స్ట్రేటజిక్‌ సపోర్ట్‌ ఫోర్స్‌(ఎస్‌ఎస్‌ఎఫ్‌)కు నవీన రూపమే ఐఎస్‌ఎఫ్‌ అని పరిశీలకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని