ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది.
పరిమిత స్థాయిలో డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణుల ప్రయోగం
అణుకేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యం
ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుళ్లు
ఇరాన్ మీడియాలో మూడు డ్రోన్లు కూల్చినట్లు వార్తలు
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. ఇందుకు ఆ దేశ సుప్రీం అధినేత అయాతుల్లా అలీ ఖొమేనీ 85వ పుట్టిన రోజునే ఎంచుకోవడం గమనార్హం. అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇరాన్లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్పై డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణులు ప్రయోగించింది. దాడిలో పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడిని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. టెల్అవీవ్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఇరాన్ కూడా ఈ విషయంలో మౌనం వహించడం విశేషం. ఈ నెల 13న మూడువందలకుపైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో ఇజ్రాయెల్పై విరుచుకుపడినప్పటినుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్పై నెతన్యాహు భారీగా విరుచుకుపడతారని అందరూ భావించారు. కానీ పరిమిత స్థాయిలోనే క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామునే భారీ పేలుళ్లు
ఇరాన్లో ఇస్ఫహాన్ ప్రావిన్సులో తెల్లవారుజామునే భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.. వెంటనే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభమైనట్లు అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ తదితర పత్రికలు పేర్కొన్నాయి. ఇరాన్ మాత్రం ఖండించింది. తమ గగనతలంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను యాంటీ ఎయిర్క్రాఫ్ట్ తుపాకులతో నేలకూల్చామని, ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని పేర్కొంది. దాడుల సమయంలో టెహ్రాన్ తన గగనతలాన్ని మూసివేసింది. పలు విమానాలను దారి మళ్లించింది. గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. అయితే ఎక్కడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు మాత్రం ఆ దేశ ప్రభుత్వ మీడియా ఐఆర్ఎన్ఏ తెలిపింది.
ఇస్ఫహానే ఎందుకు..
వ్యూహాత్మకంగా, సైనికపరంగా ఇస్ఫహాన్ కీలక ప్రాంతం. పలు సైనిక స్థావరాలు, పరిశోధన కేంద్రాలు, అణుకేంద్రాలకు నిలయం. ఇరాన్ ప్రధాన వైమానిక స్థావరం ఇక్కడే ఉంది. అణుశుద్ధి కేంద్రం ఉన్న నతాంజ్ నగరమూ ఇస్ఫహాన్కు సమీపంలోనే ఉంది. భారీ సంఖ్యలో డ్రోన్, బాలిస్టిక్ క్షిపణుల తయారీ కర్మాగారాలూ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఈ నగరాన్ని టెల్ అవీవ్ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్లోని ఏ అణుకేంద్రానైన్నా తాము సునాయాసంగా లక్ష్యం చేసుకోగలమన్న సందేశం ఇవ్వడం కూడా ఇస్ఫహాన్ను ఇజ్రాయెల్ ఎంచుకోవడానికి కారణమని రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అణు కేంద్రాలపై ఎలాంటి దాడుల జరగలేదని, సురక్షితంగా ఉన్నాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఆఖరి నిమిషంలో అగ్రరాజ్యానికి..
ఇరాన్లో పేలుళ్ల వెనక ఇజ్రాయెల్ ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. దాడికి ముందు ఇజ్రాయెల్, అమెరికా రక్షణ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పెంటగాన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటలీ విదేశాంగమంత్రి ఆంటోనియో టజాని మాత్రం ఆఖరి నిమిషంలోనే దాడి విషయాన్ని అమెరికాకు ఇజ్రాయెల్ చెప్పిందని పేర్కొన్నారు. జీ7 విదేశాంగమంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని అమెరికా తెలిపిందని అన్నారు. దాడులు, ప్రతి దాడులు ఆపాలని ఇరు దేశాలను ఐక్యరాజ్యసమితి కోరింది. ఉద్రిక్తతలను నివారించేందుకు అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇజ్రాయెల్ను వీడండి
తాజా పరిణామాలతో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇజ్రాయెల్లోని ఆస్ట్రేలియన్లు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరించింది. ఈ దాడులతో గగనతలాన్ని మూసివేసే అవకాశముందని హెచ్చరించింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 30 వరకు టెల్ అవీవ్కు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.
‘రాకెట్లను అంతరిక్షంలోకి పంపిద్దాం’
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ‘‘మనమంతా రాకెట్లను పరస్పరం ప్రయోగించుకోవడం మాని.. అంతరిక్షంలోకి పంపించాలి’’ అంటూ శాంతియుత పరిస్థితులకు ఆయన పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
బోయింగ్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన విజిల్ బ్లోయర్ ఒకరు ఆకస్మికంగా మరణించారు. రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు విజిల్ బ్లోయర్లు మరణించడం గమనార్హం. -
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
USA: ఓ ఆరేళ్ల బాలుడిని అతడి తండ్రి ట్రెడ్మిల్పై వేగంగా పరిగెత్తించడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అగ్రరాజ్యంలో జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
Dubai Rains: దుబాయ్ నగరంలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. ఈ ఎడారి దేశానికి వెళ్లే ప్రయాణికులకు భారత ఎయిర్లైన్స్ అడ్వైజరీ జారీ చేశాయి. -
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి