ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది.
పరిమిత స్థాయిలో డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణుల ప్రయోగం
అణుకేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యం
ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుళ్లు
ఇరాన్ మీడియాలో మూడు డ్రోన్లు కూల్చినట్లు వార్తలు
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. ఇందుకు ఆ దేశ సుప్రీం అధినేత అయాతుల్లా అలీ ఖొమేనీ 85వ పుట్టిన రోజునే ఎంచుకోవడం గమనార్హం. అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇరాన్లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్పై డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణులు ప్రయోగించింది. దాడిలో పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడిని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. టెల్అవీవ్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఇరాన్ కూడా ఈ విషయంలో మౌనం వహించడం విశేషం. ఈ నెల 13న మూడువందలకుపైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో ఇజ్రాయెల్పై విరుచుకుపడినప్పటినుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్పై నెతన్యాహు భారీగా విరుచుకుపడతారని అందరూ భావించారు. కానీ పరిమిత స్థాయిలోనే క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామునే భారీ పేలుళ్లు
ఇరాన్లో ఇస్ఫహాన్ ప్రావిన్సులో తెల్లవారుజామునే భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.. వెంటనే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభమైనట్లు అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ తదితర పత్రికలు పేర్కొన్నాయి. ఇరాన్ మాత్రం ఖండించింది. తమ గగనతలంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను యాంటీ ఎయిర్క్రాఫ్ట్ తుపాకులతో నేలకూల్చామని, ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని పేర్కొంది. దాడుల సమయంలో టెహ్రాన్ తన గగనతలాన్ని మూసివేసింది. పలు విమానాలను దారి మళ్లించింది. గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. అయితే ఎక్కడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు మాత్రం ఆ దేశ ప్రభుత్వ మీడియా ఐఆర్ఎన్ఏ తెలిపింది.
ఇస్ఫహానే ఎందుకు..
వ్యూహాత్మకంగా, సైనికపరంగా ఇస్ఫహాన్ కీలక ప్రాంతం. పలు సైనిక స్థావరాలు, పరిశోధన కేంద్రాలు, అణుకేంద్రాలకు నిలయం. ఇరాన్ ప్రధాన వైమానిక స్థావరం ఇక్కడే ఉంది. అణుశుద్ధి కేంద్రం ఉన్న నతాంజ్ నగరమూ ఇస్ఫహాన్కు సమీపంలోనే ఉంది. భారీ సంఖ్యలో డ్రోన్, బాలిస్టిక్ క్షిపణుల తయారీ కర్మాగారాలూ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఈ నగరాన్ని టెల్ అవీవ్ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్లోని ఏ అణుకేంద్రానైన్నా తాము సునాయాసంగా లక్ష్యం చేసుకోగలమన్న సందేశం ఇవ్వడం కూడా ఇస్ఫహాన్ను ఇజ్రాయెల్ ఎంచుకోవడానికి కారణమని రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అణు కేంద్రాలపై ఎలాంటి దాడుల జరగలేదని, సురక్షితంగా ఉన్నాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఆఖరి నిమిషంలో అగ్రరాజ్యానికి..
ఇరాన్లో పేలుళ్ల వెనక ఇజ్రాయెల్ ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. దాడికి ముందు ఇజ్రాయెల్, అమెరికా రక్షణ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పెంటగాన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటలీ విదేశాంగమంత్రి ఆంటోనియో టజాని మాత్రం ఆఖరి నిమిషంలోనే దాడి విషయాన్ని అమెరికాకు ఇజ్రాయెల్ చెప్పిందని పేర్కొన్నారు. జీ7 విదేశాంగమంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని అమెరికా తెలిపిందని అన్నారు. దాడులు, ప్రతి దాడులు ఆపాలని ఇరు దేశాలను ఐక్యరాజ్యసమితి కోరింది. ఉద్రిక్తతలను నివారించేందుకు అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇజ్రాయెల్ను వీడండి
తాజా పరిణామాలతో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇజ్రాయెల్లోని ఆస్ట్రేలియన్లు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరించింది. ఈ దాడులతో గగనతలాన్ని మూసివేసే అవకాశముందని హెచ్చరించింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 30 వరకు టెల్ అవీవ్కు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.
‘రాకెట్లను అంతరిక్షంలోకి పంపిద్దాం’
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ‘‘మనమంతా రాకెట్లను పరస్పరం ప్రయోగించుకోవడం మాని.. అంతరిక్షంలోకి పంపించాలి’’ అంటూ శాంతియుత పరిస్థితులకు ఆయన పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్