ఇరాన్పై ఇజ్రాయెల్ పిడుగు!
ప్రపంచంలో మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్-300 ఒకటి. ఎలాంటి క్షిపణినైనా పసిగట్టి కూల్చేయగల సామర్థ్యం దీని సొంతం.
ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన టెల్ అవీవ్
ప్రకంపనలు సృష్టిస్తున్న న్యూయార్క్టైమ్స్ కథనం
వాషింగ్టన్: ప్రపంచంలో మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్-300 ఒకటి. ఎలాంటి క్షిపణినైనా పసిగట్టి కూల్చేయగల సామర్థ్యం దీని సొంతం. అలాంటి వ్యవస్థనే శుక్రవారం ఇజ్రాయెల్ క్షిపణులు ధ్వంసం చేశాయని న్యూయార్క్ టైమ్స్ (ఎన్వైటీ) ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఇరాన్ అణుకేంద్రాల భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ అణుకేంద్రాలకు ఎస్-300లే కాపలా. పత్రిక కథనం ప్రకారం.. దీని రాడార్ వ్యవస్థకే దొరకకుండా ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగించిందని, అది నతాంజ్ అణుకేంద్రానికి కాపలాగా ఉన్న ఎస్-300 వ్యవస్థను ధ్వంసం చేసిందని చెబుతోంది. రాడార్లకు దొరకకుండా ఇరాన్లోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం తమకు ఉందని టెల్ అవీవ్ నిరూపించుకుందని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. ఈ క్షిపణిని యుద్ధ విమానం నుంచి ప్రయోగించినట్లు ఆ పత్రిక పేర్కొంది.
ఆ డ్రోన్లు మాకు ఆటబొమ్మలు
ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం జరిగిన దాడిపై ఇరాన్ విదేశాంగమంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ స్పందించారు. ‘‘గత రాత్రి జరిగింది దాడి కాదు. అవి డ్రోన్లు కూడా కాదు. మా పిల్లలు ఆడుకొనే ఆటబొమ్మల్లా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ‘ఎన్బీసీ’ న్యూస్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఇజ్రాయెల్ వ్యవహరిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
‘పీఎంఎఫ్’ పై దాడి
ఇరాక్లోని ఇరాన్ అనుకూల పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్(పీఎంఎఫ్) సైనిక స్థావరంపై శనివారం దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ మద్దతు ఉన్న షియా మిలిటెంట్ సంస్థల్లో పీఎంఎఫ్ ఒకటి. ఇటీవల కాలంలో ఇరాక్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై పీఎంఎఫ్ గ్రూప్ సభ్యులు దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మాత్రం ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇరాక్ విచారణ చేపట్టింది.
ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు అమెరికా భారీ సాయం
యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్లకు అమెరికా భారీ ఆర్థిక సాయం అందించనుంది. శనివారం జరిగిన అసాధారణ సమావేశంలో అమెరికా చట్ట సభ 95 బిలియన్ డాలర్ల సాయానికి ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం సభలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు చేతులు కలిపారు. ఉక్రెయిన్కు 61 బిలియన్ డాలర్లు, ఇజ్రాయల్కు 26 బిలియన్ డాలర్లను, మిగిలిన వాటిని గాజాలో మానవతా సాయానికి అమెరికా అందించనుంది.
రఫాపై దాడులు.. 9 మంది మృతి
రఫా: అమెరికా వద్దంటున్నా.. రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. శుక్రవారం రాత్రి ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. ఇందులో ఆరుగురు చిన్నారులే. గాజాకు దక్షిణాన.. ఈజిప్టునకు సమీపంలోని ఉన్న ఈ నగరంలో ఇప్పుడు దాదాపు 12 లక్షలకు పైగా ప్రజలు ఉన్నారు. ఇందులో చాలామంది ఇజ్రాయెల్ దాడి కారణంగా ఉత్తరగాజా, మధ్య గాజాను ఖాళీ చేసి వచ్చిన పాలస్తీనియన్లే. ఈ నగరంపై దాడి చేస్తే అతి పెద్ద మానవ సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు భయపడుతున్నాయి. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు