భూతాప పరిమితికి ప్లాస్టిక్తో తూట్లు
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రస్తుతమున్న రీతిలోనే కొనసాగితే.. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది.
తాజా అధ్యయనంలో వెల్లడి
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రస్తుతమున్న రీతిలోనే కొనసాగితే.. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికాకు చెందిన లారెన్స్ బెర్కలీ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ ఒప్పందంపై ఈ నెల 23- 29వరకూ కెనడాలో నాలుగో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ..
- ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాలను మండించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో హానికర గ్రీన్హౌస్ వాయువులు వెలువడతాయి. ఇతర విధానాల్లోనూ ఇవి ఉత్పత్తవుతాయి. ఈ ఉద్గారాల్లో 75 శాతం.. ప్లాస్టిక్ తయారు కాకముందే ఉత్పత్తవుతాయి. శిలాజ ఇంధనాలను మండించడం వల్లే వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
- పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల పరిమితిని మించకుండా చూడాలంటే ఈ ఏడాది నుంచే ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తి ఏటా 12 నుంచి 17 శాతం మేర తగ్గాలి.
- 2019లోనే ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తి వల్ల 2.24 గిగాటన్నుల కార్బన్ డైఆక్సైడ్కు సమానమైన గ్రీన్హౌస్ వాయువులు వెలువడ్డాయి. ఇది ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో 5.3 శాతంగా ఉంది.
- ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తిలో 2.5 శాతం పెరుగుతుందనుకున్నా.. 2050 నాటికి ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తి ద్వారా గ్రీన్హౌస్ ఉద్గారాలు రెట్టింపు స్థాయిలో వెలువడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.