డీప్ ఫేక్ చిత్రాలతో సింగపూర్ ఎంపీలకు బెదిరింపులు
ఆధునిక సాంకేతికత దుర్వినియోగం ఎలాంటి సమస్యలను తీసుకొస్తుందో సింగపూర్లో జరిగిన తాజా ఘటన ప్రబల నిదర్శనంగా నిలుస్తోంది.
బాధితుల్లో భారత సంతతి మంత్రి
సింగపూర్: ఆధునిక సాంకేతికత దుర్వినియోగం ఎలాంటి సమస్యలను తీసుకొస్తుందో సింగపూర్లో జరిగిన తాజా ఘటన ప్రబల నిదర్శనంగా నిలుస్తోంది. ఆ దేశ పార్లమెంటు సభ్యులు పలువురికి ఇటీవల బెదిరింపు లేఖలతో కూడిన కవర్లు పోస్టులో వస్తున్నాయి. వాటిని తెరచి చూడగా అశ్లీల దృశ్యాలతో ఉన్న అసభ్యకరమైన ఫొటోలు దర్శనమిచ్చాయి. ప్రతి సభ్యుడు మహిళలతో ఏకాంతంగా ఉన్నట్లు చిత్రీకరిస్తూ మార్ఫింగ్ ద్వారా వారి ముఖాలను అమర్చారు. దీంతో అవి నిజమైన చిత్రాలే అన్నట్లుగా భ్రమింపజేస్తున్నాయి. తనతో పాటు పలువురు ఎంపీలకు ఈ తరహా కవర్లు అందాయని భారత సంతతికి చెందిన విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ సామాజిక మాధ్యమం ద్వారా శనివారం వెల్లడించారు. మార్చి నెల నుంచి ఈ తరహా ఫిర్యాదులు 70 వరకు తమకు అందాయని పోలీసులు చెప్పారు. కృత్రిమ మేధ సాంకేతికత సహాయంతో డీప్ ఫేక్ చిత్రాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేయాలన్నది దుండగుల ఎత్తుగడగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కవర్లలోని బెదిరింపు ఉత్తరాల్లో ఈమెయిల్ చిరునామాలు ఇచ్చి వాటి ద్వారా తమను సంప్రదించాలని నేరగాళ్లు సూచిస్తున్నారు. డిప్ ఫేక్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన సూచిస్తోందని వివియన్ బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ