అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది.
రోదసి కార్యక్రమాలు లేని దేశాలకు అవకాశం
చేతులు కలిపిన సెరా, బ్లూ ఆరిజిన్
దిల్లీ: అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం బ్లూ ఆరిజిన్ సంస్థతో చేతులు కలిపింది. అంతరిక్ష పర్యాటకం కోసం బ్లూ ఆరిజిన్ రూపొందించిన ‘న్యూ షెపర్డ్’ వ్యోమనౌకలో ఈ యాత్ర జరుగుతుంది. భవిష్యత్లో చేపట్టబోయే మొదటి ప్రయాణం కోసం వ్యోమనౌకలోని మొత్తం ఆరు సీట్లను.. సెరా కోసం రిజర్వు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ పౌరులకూ వ్యోమగాములుగా ఎదిగే అవకాశాన్ని కల్పించేందుకు ఈ ప్రాజెక్టును సెరా చేపట్టింది. ‘‘దాదాపు 150 దేశాలకు వ్యోమగాములు లేరు. ఈ పరిస్థితిని మార్చడం మా ఉద్దేశం’’ అని సెరా సహ వ్యవస్థాపకుడు జాషువా స్కుర్లా తెలిపారు. 2022లో బ్రెజిల్కు చెందిన సివిల్ ఇంజినీరు విక్టర్ హెస్పాన్హాను ఎంపిక చేసి, బ్లూ ఆరిజిన్ వ్యోమనౌక ద్వారా రోదసిలోకి పంపామని చెప్పారు. బ్రెజిల్ తరఫున రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారన్నారు. ‘‘అంతరిక్ష రంగంలో ఉన్న అవకాశాలపై ఒక దేశం మొత్తాన్నీ ఒక వ్యక్తి ఎలా ప్రభావితం చేయగలరన్నది విక్టర్ యాత్ర ద్వారా మాకు తెలిసింది’’ అని చెప్పారు. భవిష్యత్లో అంతరిక్షంలో మానవ జీవనం.. పుడమిపైనున్న వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని న్యూ షెపర్డ్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఫిల్ జాయ్స్ తెలిపారు. వ్యోమనౌకలో రిజర్వు చేసిన ఆరు సీట్లలో ఐదింటిని.. ఒక్క వ్యోమగామి కూడా లేని లేదా అతికొద్ది మంది మాత్రమే కలిగిన దేశాలకు కేటాయిస్తారు. ఆరో సీటును ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా ఆశించొచ్చు. ప్రతి దేశానికీ అంతరిక్ష సంస్థ ఉండేలా చూడటం తమ ఉద్దేశమని సెరా చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!