జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీని వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని తాజా కథనం పేర్కొంది. దాని పేరు టోబోల్. గతంలో నాటో తూర్పు ప్రాంతంలో నౌకల సిగ్నల్స్ను అడ్డుకునేందుకు ఈ సాంకేతిక ఆయుధాన్ని మాస్కో ఉపయోగించినట్లు సమాచారం. లిథువేనియా-పోలండ్ మధ్యలోని కాలినిన్గ్రాడ్లోని రష్యా సైనిక స్థావరం కేంద్రంగా ఈ సాంకేతికత పనిచేస్తున్నట్లు ‘ది సన్’ కథనం వెల్లడించింది. ఇందుకు సంబంధించి సైనిక స్థావరం వద్ద భారీ పరిమాణంలో ఉన్న శాటిలైట్ డిష్ల చిత్రాలను ఉదహరించింది. ఇవన్నీ టోబోల్లో భాగమేనని పేర్కొంది. రష్యా వ్యాప్తంగా ఇటువంటివి పది పరికరాలు ఉన్నాయని తెలిపింది.
శాటిలైట్ సిగ్నల్స్ను అడ్డుకోవడం ద్వారా నాటో క్షిపణులకు తమ స్థావరాలు లక్ష్యంగా మారకుండా ఉండేందుకే మాస్కో ఈ వ్యవస్థను వినియోగించుకున్నట్లు సమాచారం. ఇది రెండు విధాలుగా పని చేస్తుందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఆకాశంలో శాటిలైట్లను నేరుగా లక్ష్యం చేసుకోవడం ఒకటి. ఈ తరహా జామింగ్ ద్వారా వాస్తవ సిగ్నల్స్ను ఏమార్చి.. ఆ శాటిలైట్ నుంచి వినియోగదారులకు వెళ్లే సమాచారాన్ని వక్రీకరిస్తుందని బార్డ్ హెండ్రిక్ అనే పరిశోధకుడు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో నాటో ప్రాంతంలో జీపీఎస్ అంతరాయానికి టోబోల్ కారణమని ఎస్తోనియాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ పరిణామాలు రష్యా చర్యలు లేదా హైబ్రిడ్ యుద్ధక్షేత్రంలో భాగమేనని స్వీడన్ లెఫ్టినెంట్ కర్నల్ జోవాకిమ్ పాసికివీ అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ యుద్ధంలో ప్రయోగాలు..
ఉక్రెయిన్లో స్టార్లింక్ ప్రసారాలకు అంతరాయం కలిగించేందుకు రష్యా ఈ ప్రయోగాలు చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఈ సాంకేతికత ద్వారానే బాల్టిక్ సముద్రమార్గంలో వెళ్లే వేలాది వాణిజ్య విమానాలు సిగ్నల్ సమస్యను ఎదుర్కొన్నాయని, వాటిని నేవిగేట్ చేయడం కష్టంగా మారినట్లు నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఫిన్లాండ్, పోలండ్, స్వీడన్ దేశాల్లో కొన్ని నెలలుగా ఈతరహా జీపీఎస్ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే, ఈ ‘టోబోల్’పై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.