ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి.
75 రాకెట్లతో హెజ్బొల్లా దాడి
ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మృతి
జెరూసలెం: గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. ఓ ఇజ్రాయెలీ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో టెల్ అవీవ్ గగనతలదాడులు ప్రారంభించింది. మరోవైపు లెబనాన్ నుంచీ ఇజ్రాయెల్పై హెజ్బొల్లా ఉగ్రవాదులు ఒత్తిడి పెంచుతున్నారు. శుక్రవారం ఏకంగా 75 రాకెట్లు ప్రయోగించారు. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. హమాస్ చెరలోని ముగ్గురు బందీల మృత దేహాలు గాజాలో లభ్యమయ్యాయని శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ప్రకటించాయి. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమంపై హమాస్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ ముగ్గురిని హమాస్ మిలిటెంట్లు కాల్చి చంపారని.. అనంతరం వారి మృత దేహాలను గాజాకు తరలించారని ఐడీఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డానియల్ హగారి తెలిపారు.
భారత్కు చేరిన కాలె భౌతికకాయం
దిల్లీ: గాజాలో మృతి చెందిన భారత మాజీ సైన్యాధికారి వైభవ్ అనిల్ కాలె(46) భౌతిక కాయం శుక్రవారం భారత్ చేరుకుంది. ఆయన మృతదేహానికి పూర్తి అధికారిక లాంఛనాలతో పుణెలో అంత్యక్రియలు నిర్వహించారు. గతంలో సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన కాలె.. రెండు నెలల క్రితం ఐక్యరాజ్యసమితి భద్రత, రక్షణ విభాగంలో చేరారు. ఆ విధుల్లో భాగంగా రఫాలోని ఓ ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించడానికి ఐరాస జెండా ఉన్న వాహనంతో వెళుతున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైద్యులకు ఏఐ అండ!
ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషీన్ లెర్నింగ్ సాధనాలు.. సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. -
భారత సంతతి వారితో అమెరికా ఆర్థికానికి భారీ ప్రయోజనం
అమెరికా జనాభాలో భారత సంతతివారు 1.5 శాతమే ఉన్నా.. వారివల్ల దేశార్థికానికి జరుగుతున్న మేలు అంతా ఇంతా కాదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం తేల్చింది. ‘2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా 50 లక్షలకు చేరింది. -
బ్రిటన్ రాజు అధికారిక జన్మదిన వేడుకల్లో కేట్ ప్రత్యక్షం
గత కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ ప్రజాజీవితానికి దూరంగా ఉన్న వేల్స్ యువరాణి కేట్ మిడిల్డన్ శనివారం బ్రిటన్ ప్రజలకు దర్శనమిచ్చారు. లండన్లో జరిగిన కింగ్ ఛార్లెస్ అధికారిక పుట్టిన రోజు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. -
ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు చైనా ప్రధాని
దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా చైనా ప్రధాని లీ కియాంగ్ శనివారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. గత ఏడేళ్లలో చైనా ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
పాక్లో బక్రీద్ కానుకగా పెట్రోల్ ధర రూ.10 తగ్గింపు
నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజానీకానికి ఊరటనిస్తూ ఈదుల్ అధా (బక్రీద్) పండగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్ డీజిలు (హెచ్ఎస్డీ)పై రూ.2.33 మేర తగ్గించింది. -
ఆర్థిక నడవాలు.. పెట్టుబడులకు ఊతం
ప్రపంచస్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం (పీజీఐఐ) మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి, ఎలాంటి ఆంక్షల్లేని ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ సిరిల్ రామఫోసా
సిరిల్ రామఫోసా (71) మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రామఫోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీని కోల్పోయింది. -
ఇజ్రాయెల్ ఆర్మీ కాన్వాయ్పై దాడి
దక్షిణ గాజాలో హమాస్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు శనివారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉదయం ఐదుగంటల ప్రాంతంలో సైనిక కాన్వాయ్పై హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృత్యువాతకు గురయ్యారు. -
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. -
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ యుద్ధ విమానాలు కూల్చివేసిన.. ఓ ప్రయాణికుల విమానం శకలాలు ఎనిమిది దశాబ్దాల తర్వాత లభ్యమయ్యాయి. -
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
కువైట్లోని అల్ మంగాఫ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు వెల్లువెత్తగా.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు.