గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు.
ఇజ్రాయెల్ దాడి కారణంగా గాజాలోని నుసిరత్ ప్రాంతంలో ధ్వంసమైన పునరావాస శిబిరం
డెయిర్ అల్-బలా (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఇదే ప్రాంతంలో వీధిపై జరిగిన మరో దాడిలో ఐదుగురు చనిపోయారు. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. వారం వ్యవధిలో కనీసం 150 మృతదేహాలు లభ్యమైనట్లు పౌర రక్షణ విభాగ ప్రతినిధి తెలిపారు. యుద్ధం తర్వాత గాజాను ఎవరు పాలించాలనే విషయంలో ఇజ్రాయెల్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హమాస్పై పోరు ముమ్మరంగా సాగుతోంది. ప్రతిష్టంభనను తొలగించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అమెరికా జాతీయ భద్రత సలహాదారుడు జేక్ సులివాన్ చర్చలు జరిపారు. అంతకుముందు సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్తోనూ ఆయన భేటీ అయ్యారు. కాల్పుల విరమణకు అంగీకారం తెలపకుండా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడానికి నెతన్యాహు కారణమని ఆరోపిస్తూ వేలసంఖ్యలో నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు. హమాస్ను పూర్తిగా నాశనం చేసేవరకు, గాజాలో బందీలుగా ఉన్న వందమందిని విడిపించేవరకు దాడులు కొనసాగుతాయని, దీనిలో రాజకీయ ఉద్దేశాలేవీ లేవని నెతన్యాహు స్పష్టంచేస్తున్నారు. ఒకపక్క హమాస్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నప్పుడు యుద్ధానంతర ఏర్పాట్లపై చర్చలో అర్థంలేదని వ్యాఖ్యానించారు.
చమురు నౌకపై క్షిపణి దాడి
దుబాయ్: యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఒక చమురు నౌకపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు. పనామా పతాకంతో ఈ నౌక చైనాకు వెళ్తూ దాడిలో పాక్షికంగా దెబ్బతింది. అమెరికాకు చెందిన ఒక డ్రోన్ను యెమెన్ గగనతలంలో హూతీలు కూల్చివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
అమెరికాలో పాలస్తీనా అనుకూల ప్రదర్శన
వాషింగ్టన్: అమెరికా పార్లమెంటు భవన సమీపంలో వందలమంది పాలస్తీనా అనుకూల ప్రజలు ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. ఇజ్రాయెల్కు, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. గాజాలో ప్రస్తుత యుద్ధం, గతంలో 7 లక్షల మంది పాలస్తీనీయులు వలసపోవాల్సి రావడం వంటివి గుర్తుచేస్తూ ఆవేదన వ్యక్తపరిచారు. ఆగకుండా కురుస్తున్న వాననూ లెక్కచేయకుండా వారు ర్యాలీ కొనసాగించారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలకు వెంటనే ముగింపు పలకాలని, పాలస్తీనీయుల హక్కుల్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.