నెతన్యాహుపై అరెస్టు వారెంట్ ఇవ్వండి
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు.
హమాస్ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనియాపైనా జారీ చేయండి
ఐసీసీని కోరిన ప్రధాన ప్రాసిక్యూటర్
జెరుసలేం: ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు.
గాజా స్ట్రిప్లో నెతన్యాహు, ఇజ్రాయోల్ రక్షణమంత్రి యెవా గాలెంట్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ఖాన్ ఆరోపించారు. వారి కారణంగా ఎంతోమంది అమాయక పౌరులు బాధలు అనుభవిస్తున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఈ యుద్ధంలో అనేకమంది మహిళలు, చిన్నారులు, పసికందులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. మరోపక్క అక్టోబరు 7న ఇజ్రాయెల్ పౌరులపై పాల్పడిన నేరాలకు హమాస్ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని కరీమ్ఖాన్ అభ్యర్థించారు. వీరి మెరుపు దాడులతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని, ఎంతోమంది తమ ప్రియమైనవారిని కోల్పోయారన్నారు. ప్రాసిక్యూటర్ వినతిపై ఐసీసీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.మరోపక్క 2014 నాటి గాజా యుద్ధం కేసులో ఇజ్రాయెల్ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేసే అవకాశాలున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈ వారెంట్లు జారీ అయితే, ఆ దేశ అధికారులను ఐసీసీ భాగస్వామ్య దేశాల్లో అరెస్టుచేసే ప్రమాదం ఉంది.
ఖండించిన నెతన్యాహు, జో బైడెన్
ఐసీసీ ప్రాసిక్యూటర్ వినతిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇది దారుణమైన విజ్ఞాపన అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మండిపడ్డారు. ఈ తప్పిదాన్ని చరిత్ర ఎల్లకాలం గుర్తుంచుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి కాజ్ ధ్వజమెత్తారు. దీన్ని ఎదుర్కొనడానికి తామో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వివరించారు. కాగా ఐసీసీ ప్రాసిక్యూటర్ వినతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. ఇజ్రాయెల్ నేతలను, హమాస్ తీవ్రవాదులను ఒక గాటనకట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు.
బాధితులను, తలారిని ఒకే గాటన కట్టారు: హమాస్
ఐసీసీకి కరీమ్ఖాన్ చేసిన విజ్ఞప్తిపై హమాస్ ఆక్షేపణలు తెలిపింది. ఈ చర్య బాధితులను, తలారిని ఒకే గాటన కట్టినట్లుందని విమర్శించింది. ఇద్దరు ఇజ్రాయెల్ నేతల అరెస్టునే కోరారని తప్పుపట్టింది. మిగిలిన నేతల అరెస్టును కోరాలని సూచించింది. ఇజ్రాయెల్ ఆక్రమణను, సైనిక దాడిని అడ్డుకునే హక్కు తమకుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట