అండర్ 16... నో సోషల్ మీడియా!
తిండి తినటం లేదంటే... ఏడాది పిల్లలకూ సెల్ఫోన్ చేతిలో పెట్టేసి... ముద్ద నోట్లో పెడుతున్న కాలం! తప్పని తెలిసినా అనివార్యంగా పిల్లలను ఫోన్లకు, సోషల్ మీడియాకు అలవాటు చేస్తున్నామనే ఆందోళన పెరుగుతోంది.
తిండి తినటం లేదంటే... ఏడాది పిల్లలకూ సెల్ఫోన్ చేతిలో పెట్టేసి... ముద్ద నోట్లో పెడుతున్న కాలం! తప్పని తెలిసినా అనివార్యంగా పిల్లలను ఫోన్లకు, సోషల్ మీడియాకు అలవాటు చేస్తున్నామనే ఆందోళన పెరుగుతోంది. అందుకే... పదహారేళ్ల వయసు దాటేదాకా పిల్లలను సోషల్మీడియాకు దూరంగా ఉంచాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. తాజాగా ఆస్ట్రేలియా ఆ దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్మీడియా చూడకుండా నిషేధం విధించాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఫేస్బుక్లాంటి అనేక సోషల్మీడియా వేదికల్లో చేరికకు 13 ఏళ్ల వయసుండాలనే నిబంధన ఉన్నా... దాన్ని అతిక్రమించడం పెద్ద కష్టమేమీ కావటం లేదు. అందుకే ఏకంగా నిషేధం విధించేలా చట్టం చేయాలనుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని అనేక రాష్ట్రాలతో పాటు... ఆదేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఇందుకు మద్దతు పలికారు. మితిమీరిన సోషల్మీడియా వాడకం పిల్లల్ని దారితప్పేలా చేయటంతోపాటు... వారి మానసిక ఆరోగ్యానికీ నష్టం చేస్తోందన్నారు. ఆన్లైన్లో కాకుండా... మైదానాల్లో ఆడుకునేలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చైనా, జపాన్, ఫ్రాన్స్లాంటి దేశాలు... నిషేధం విధించకున్నా... పిల్లలు మొబైల్, ట్యాబ్లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాయి. అంతెందుకు... ప్రపంచానికి ఐఫోన్లాంటివాటిని పరిచయం చేసిన... స్టీవ్జాబ్స్ తన పిల్లలను టీనేజీ దాటేదాకా సెల్ఫోన్లకు దూరంగా ఉంచారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ సైతం... తన పిల్లల్ని గ్యాడ్జెట్స్ నుంచి కాపాడుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుతిన్ నోట సంధి మాట
ఉక్రెయిన్తో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలని, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులు విధించారు. -
సాంకేతికతలపై గుత్తాధిపత్యం వద్దు
సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
ద్వైపాక్షిక భేటీలతో మోదీ బిజీబిజీ
జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వరుస ద్వైపాక్షిక భేటీలతో తీరిక లేకుండా గడిపారు. -
నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు!
జీ7 సదస్సు వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. సదస్సుకు వచ్చిన నేతలు బృందచిత్రం కోసం నిలబడి ఉండగా.. వారంతా ఉన్నవైపు కాకుండా బైడెన్ మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. -
ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కసరత్తు
భారత్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలను ప్రపంచంలో మరే దేశంతో పోల్చినా అతిపెద్ద ఎన్నికలుగా అమెరికా ప్రశంసించింది. ‘‘భారత్లో జరిగిన ఎన్నికలను మేము ఆస్వాదించాం. -
జాబిల్లి పరిశోధన కేంద్రం నిర్మాణంలో చైనాతో రష్యా భాగస్వామ్యం
అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని చైనా, రష్యా సంయుక్తంగా నిర్మించేందుకు తలపెట్టిన ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. -
ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధం చెల్లదు
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తుపాకీ ఉపకరణాల్లో ఒకటైన బంప్స్టాక్స్పై విధించిన నిషేధాన్ని శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు ఎత్తివేసింది. -
హజ్ యాత్ర ప్రారంభం
ఎడారి ఉష్ణోగ్రతల ఉక్కపోత నడుమ శుక్రవారం ముస్లింల వార్షిక హజ్ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఇస్లాం మతస్థులు అతి పవిత్రమైనదిగా భావించే దివ్య మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలతో ఈ యాత్ర మొదలైంది. -
ఐరోపాపై వలసల ఒత్తిడి తగ్గించాలి
ఐరోపా దేశాలపై వలసల ఒత్తిడి తగ్గించేందుకు మెరుగైన మార్గాలు అన్వేషించాలని జీ7 దేశాలు తీర్మానించాయి. -
పెరుగుతున్న రోజు నిడివి
భూగోళ కేంద్ర భాగ (కోర్) భ్రమణ వేగం తగ్గుతోందని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు స్పష్టం చేశారు. -
దీర్ఘకాల నొప్పికి కొత్త చికిత్సా విధానం
పెద్దలను దీర్ఘకాలంగా పీడించే నొప్పిని తగ్గించడానికి సరికొత్త మానసిక చికిత్సా విధానం రూపొందింది. 2000 సంవత్సరం నుంచి ప్రయోగ దశలో ఉన్న ఈ విధానాన్ని భావోద్వేగ స్పృహ, అభివ్యక్తి చికిత్స (ఈఏఇటి)గా వ్యవహరిస్తున్నారు. -
జీ7 వేదికగా.. కృత్రిమ మేధపై పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు
కృత్రిమ మేధ వంటి శక్తిమంతమైన సాంకేతికత.. మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ప్రమాదం ఉందని పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు. -
ఇటుక బట్టీలో పెట్టి.. రూ.584 కోట్ల విలువైన డ్రగ్స్ కాల్చేసి!
కంబోడియా దేశం రూ.584 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్, సంబంధిత పదార్థాలను దహనం చేసింది.