వచ్చే నెల మొదటివారంలో సునీత రోదసి యాత్ర

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడో అంతరిక్ష యాత్ర వచ్చే నెల 1 నుంచి 5 మధ్య జరిగే అవకాశం ఉంది.

Published : 24 May 2024 04:46 IST

హ్యూస్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడో అంతరిక్ష యాత్ర వచ్చే నెల 1 నుంచి 5 మధ్య జరిగే అవకాశం ఉంది. బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవసహిత రోదసి యాత్ర. ఈ నెల 6న దీని ప్రయోగానికి ప్రయత్నించినప్పటికీ సాంకేతిక సమస్యతో అది నిలిచిపోయింది. స్టార్‌లైనర్‌ పనితీరును విశ్లేషించేందుకు ఇంజినీర్లు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. వ్యోమనౌకలోని సర్వీసు మాడ్యూల్‌లో చిన్నపాటి హీలియం లీకేజీని గుర్తించడంతో అన్ని వ్యవస్థలనూ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ వ్యోమనౌకలో సునీతతో పాటు బుచ్‌ విల్‌మోర్‌ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో వారం పాటు బసచేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని