ఉక్రెయిన్ సరిహద్దులపై విరుచుకుపడుతున్న రష్యా
ఉక్రెయిన్ ఈశాన్యంలో ఉన్న ఖర్కీవ్ ప్రాంతంపై రష్యా తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. శుక్రవారం జరిగిన దాడుల్లో రైలు పట్టాలు, రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రైలు పట్టాలు, మౌలిక వసతులు ధ్వంసం
కీవ్: ఉక్రెయిన్ ఈశాన్యంలో ఉన్న ఖర్కీవ్ ప్రాంతంపై రష్యా తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. శుక్రవారం జరిగిన దాడుల్లో రైలు పట్టాలు, రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రష్యా దాడుల్లో భవనాలు కూడా దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ నెల 10 నుంచి ఖర్కీవ్ ప్రాంతంపై రష్యా విరుచుకుపడుతోంది. నాటి నుంచి 11 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వచ్చే 60 రోజుల్లో అనాథలు, ఒంటరి పిల్లలను తప్పనిసరిగా అక్కడి నుంచి తరలించాలని ప్రాంతీయ గవర్నర్ ఒలెహ్ సినేహుబో వివరించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి. ఇవన్నీ ఒక వ్యూహం ప్రకారం సమన్వయంతో సాగుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంతో కుదేలైన ఉక్రెయిన్కు ఇది శరాఘాతంగా మారింది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్ సైన్యానికి తాజాగా రైల్వే నెట్వర్క్ ధ్వంసంతో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. రష్యా దాడులను ఎదుర్కోవడానికి అవసరమైన గగనతల రక్షణ వ్యవస్థలు పశ్చిమ దేశాల నుంచి అందకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రష్యా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోగల దీర్ఘశ్రేణి అస్త్రాలను ఇవ్వడానికి ఆ దేశాలు ఇష్టపడటంలేదు. దీంతో ఉక్రెయిన్ సరిహద్దులపై పుతిన్ సేన విరుచుకుపడుతోంది. ఈ ఆయుధాల లోటే ఖర్కీవ్పై దాడులకు కారణమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. గురువారం రష్యా క్షిపణి ఒకటి ఒక ప్రింటింగ్ కంపెనీపై పడిందని, ఫలితంగా 50వేల పుస్తకాలు దగ్ధమయ్యాయని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. -
హమాస్.. ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హమాస్తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్