విమానాన్ని కుదిపేసిన గురుత్వాకర్షణ బలాలు
గురుత్వాకర్షణ బలాల్లో వేగంగా చోటుచేసుకున్న మార్పు వల్లే గతవారం సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం.. గాల్లో 178 అడుగుల మేర అకస్మాత్తుగా కిందకి వచ్చేసిందని ప్రాథమిక విచారణలో తేలింది.
సింగపూర్ ఫ్లైట్ కుదుపులపై ప్రాథమిక నివేదిక
సింగపూర్: గురుత్వాకర్షణ బలాల్లో వేగంగా చోటుచేసుకున్న మార్పు వల్లే గతవారం సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం.. గాల్లో 178 అడుగుల మేర అకస్మాత్తుగా కిందకి వచ్చేసిందని ప్రాథమిక విచారణలో తేలింది. విమానంలోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైన డేటా ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ నెల 21న ‘ఫ్లైట్ ఎస్క్యూ321’ విమానం లండన్ నుంచి సింగపూర్ బయల్దేరింది. మయన్మార్లో ఇరావాడ్డీ బేసిన్పై ఉండగా తీవ్రస్థాయి కుదుపులకు లోనైంది. ఇందులో బ్రిటన్కు చెందిన ఒక ప్రయాణికుడు దుర్మరణం పాలయ్యాడు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. తాజాగా దీనిపై సింగపూర్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (టీఎస్ఐబీ)కు చెందిన నిపుణులు ఒక ప్రాథమిక నివేదికను సమర్పించారు. దీని ప్రకారం..
- నాడు బోయింగ్ 777-300ఈఆర్ శ్రేణికి చెందిన ఈ విమానం.. 37వేల అడుగుల ఎత్తులో పయనిస్తోంది. అకస్మాత్తుగా 19 సెకన్ల పాటు గురుత్వాకర్షణ బలాల్లో +0.44జీ నుంచి +1.57 వరకూ వైరుధ్యాలు వచ్చాయి. ఫలితంగా విమానం కుదుపులకు లోనైంది.
- భూమి సాధారణ గురుత్వాకర్షణ బలంతో పోల్చి చూసినప్పుడు తలెత్తే హెచ్చుతగ్గులను జీ బలాలు సూచిస్తాయి. సాధారణ గురుత్వాకర్షణ బలాన్ని +1జీగా పేర్కొంటారు. అది +1.57జీకి పెరిగితే ఒక వ్యక్తికి తన బరువు సాధారణం కన్నా 1.57 రెట్లు ఎక్కువగా పెరిగిందన్న భావన కలుగుతుంది. సింగపూర్ విమానంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది.
- అదే సమయంలో ఆ లోహ విహంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. విమానం 37,362 అడుగుల ఎత్తుకు చేరింది. ఈ దశలో ఆ లోహవిహంగంలోని ఆటోపైలట్ వ్యవస్థ.. దాన్ని నిర్దేశిత క్రూజ్ ఎత్తుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ గందరగోళం నడుమ.. సీటు బెల్ట్లు పెట్టుకోవాలంటూ ప్రయాణికులకు పైలట్లు సూచనలు ఇచ్చారు.
- 8 సెకన్ల తర్వాత విమానం.. జీ బలాల్లో తీవ్రస్థాయి వైరుధ్యాలు వచ్చాయి. 0.6 సెకన్లలోనే +1.35జీ నుంచి మైనస్ 1.5జీకి అవి మారాయి. నెగెటివ్ జీ బలాల వల్ల ప్రయాణికులకు గాల్లో తేలియాడున్న భావన కలుగుతుంది. అప్పటికే సీటు బెల్టు పెట్టుకోని ప్రయాణికులు.. గాల్లో పైకి లేచారు. ఆ తర్వాత నాలుగు సెకన్లలోనే జీ బలాలు +1.5జీకి చేరాయి. దీనివల్ల విమానం ప్రయాణిస్తున్న ఎత్తు 37,362 అడుగుల నుంచి 37,184 అడుగులకు పడిపోయింది. ఫలితంగా ప్రయాణికులంతా సీట్లలో పడిపోయారు.
- 4.6 సెకన్ల వ్యవధిలో గురుత్వాకర్షణ బలాల్లో వేగంగా వచ్చిన మార్పుల వల్ల 178 అడుగుల మేర విమానం ఎత్తు తగ్గిపోయింది. ఈ ఘటనల్లో ప్రయాణికులు, సిబ్బందికి గాయాలయ్యాయి.
- ఈ సమయంలో పైలట్లు విమానాన్ని నియంత్రణలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఆటోపైలట్ వ్యవస్థను నిలిపివేశారు. విమానాన్ని బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్పోర్టుకు మళ్లించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు