నదిలో మునిగి రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థుల మృతి

రష్యాలో విషాదం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన నలుగురు వైద్యవిద్యార్థులు ప్రమాదవశాత్తు వోల్ఖోవ్‌ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

Published : 08 Jun 2024 06:19 IST

మాస్కో: రష్యాలో విషాదం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన నలుగురు వైద్యవిద్యార్థులు ప్రమాదవశాత్తు వోల్ఖోవ్‌ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగా.. మిగతా వాటి కోసం గాలిస్తున్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సమీపంలోని యారోస్లావ్‌ ది వైస్‌ నోవ్‌గొరోడ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు బుధవారం తమకు సమీపంలోని వోల్ఖోవ్‌ నది ఒడ్డుకు వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడింది. ఆమెను కాపాడేందుకు నలుగురు విద్యార్థులు నదిలోకి దిగారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోగా ఓ అమ్మాయిని స్థానికులు కాపాడారు. మృతులను మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాకు చెందిన హర్షల్‌ అనంత్‌రావ్, జీషన్‌ పింజారీ, జియా పింజారీ, మాలిక్‌ మహమ్మద్‌ యాకూబ్‌లుగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని